అమెరికాలో భారతీయ విద్యార్థికి జైలు శిక్ష
అమెరికాలో భారీ టెలిమార్కెటింగ్ స్కామ్కు పాల్పడిన భారతీయ విద్యార్థి బిశ్వజీత్ కుమార్ ఝాకు అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. పెన్షనర్లను టార్గెట్ చేస్తూ దాదాపు 9,37, 280 డాలర్లను కొట్టేశాడు. 12 మంది వృద్ధులు ఈ స్కామ్లో మోసపోయారు. కొందరు పెన్షనర్లకు ఫోన్ చేసి.. ఓ బూటకపు సంస్థ పేరు చెప్పి మా సంస్థ నుంచి పొరపాటున మీ అకౌంట్లో మనీ ట్రాన్సఫర్ అయిందంటూ వారిని నమ్మబలికిస్తారు. అయితే ఇది నిజమని నమ్మిన కొంతమంది […]
అమెరికాలో భారీ టెలిమార్కెటింగ్ స్కామ్కు పాల్పడిన భారతీయ విద్యార్థి బిశ్వజీత్ కుమార్ ఝాకు అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. పెన్షనర్లను టార్గెట్ చేస్తూ దాదాపు 9,37, 280 డాలర్లను కొట్టేశాడు. 12 మంది వృద్ధులు ఈ స్కామ్లో మోసపోయారు. కొందరు పెన్షనర్లకు ఫోన్ చేసి.. ఓ బూటకపు సంస్థ పేరు చెప్పి మా సంస్థ నుంచి పొరపాటున మీ అకౌంట్లో మనీ ట్రాన్సఫర్ అయిందంటూ వారిని నమ్మబలికిస్తారు. అయితే ఇది నిజమని నమ్మిన కొంతమంది తమ అకౌంట్ నుంచి వారు చెప్పిన ఎకౌంట్కి అడిగిన మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా దాదాపు మూడు నెలల పాటు ఈ స్కామ్ను కొనసాగించారు బిశ్వజీత్ కుమార్ టీమ్.
2018లో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. న్యూపోర్టు పోలీసులు అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేసి ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరించి.. బిశ్వజీత్ కుమార్ను అరెస్టు చేశారు. అతనితో పాటు.. భారత్ నుంచి ఇంటర్న్షిప్ కోసం అమెరికాకు వెళ్ళిన మరి కొందరు విద్యార్థులకి ఈ కుంభకోణంలో పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. కాగా.. శిక్షాకాలం అనంతరం బిశ్వజీత్ను భారత్కు తిరిగి పంపనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.