నాగాలాండ్లో కుక్క మాంసం బ్యాన్..
భారత దేశంలో చికెన్, మటన్ తినడానికే కొందరు ఆలోచిస్తూంటారు. అలాంటిది ఇతర దేశాల్లో మాత్రం కుక్కల్ని, పిల్లుల్ని, బల్లుల్ని, గబ్బిలాలను ఎంతో ఈజీగా తినేస్తూంటారు. బహిరంగ మార్కెట్లోనే వాటిని అమ్ముతూంటారు. అందులోనూ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్..
భారత దేశంలో చికెన్, మటన్ తినడానికే కొందరు ఆలోచిస్తూంటారు. అలాంటిది ఇతర దేశాల్లో మాత్రం కుక్కల్ని, పిల్లుల్ని, బల్లుల్ని, గబ్బిలాలను ఎంతో ఈజీగా తినేస్తూంటారు. బహిరంగ మార్కెట్లోనే వాటిని అమ్ముతూంటారు. అందులోనూ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో పలు జంతువుల మాంసాన్ని బ్యాన్ చేసింది ఆ దేశ ప్రభుత్వం. తాజాగా నాగాలాండ్లో కూడా కుక్క మాంసాన్ని బ్యాన్ చేశారు. అసలు కుక్క మాంసాన్ని ఎప్పటి నుంచో బ్యాన్ చేయాలని జంతు ప్రేమికులు నిరసనలు, ర్యాలీలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కరోనా ఎఫెక్ట్తో నాగాలాండ్ ప్రభుత్వం దిగి వచ్చింది. ఇకపై మాంసం దిగుమతి, వ్యాపారం, అమ్మకం ఉండదని వెల్లడించింది.
అయితే నాగాలాండ్ ప్రభుత్వం జంతు ప్రేమికుల మొర విని ఈ నిషేధం విధించలేదు. అసలేం జరిగిందంటే.. నాగాలాండ్లో ఓ మార్కెట్లో సంచుల్లో కుక్కుల్ని తాళ్లతో కట్టి అమ్మకానికి సిద్దంగా ఉంచారు. ఆ ఫొటోలు తీసిన కొందరు.. చైనాలో ఇలాంటి వెట్ మార్కెట్ల వల్లనే కరోనా వైరస్ వ్యాపించిందని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా బాగా వైరల్ అవడంతో.. నాగాలాండ్ ప్రభుత్వంపై బాగా ఒత్తిడి పెరిగింది. దీంతో నాగా గవర్నమెంట్ దిగి రావాల్సి వచ్చింది.
The State Government has decided to ban commercial import and trading of dogs and dog markets and also the sale of dog meat, both cooked and uncooked. Appreciate the wise decision taken by the State’s Cabinet @Manekagandhibjp @Neiphiu_Rio
— Temjen Toy (@temjentoy) July 3, 2020
This is urgent. You can help make history by sending an email tonight to csngl@nic.in saying Nagaland must stop dog markets, dog restaurants and smuggling of dogs into the state. Eating dog meat is inhuman, not just illegal. The issue comes before the cabinet tomorrow. pic.twitter.com/4Bv42EXuYN
— Pritish Nandy (@PritishNandy) July 1, 2020