జశ్వంత్‌ సింగ్‌ కు ప్రముఖుల ఘన నివాళి

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌(82) ఈరోజు ఉదయం కన్నుమూశారు. దివంగత ప్రధాని వాజ్‌పేయి హయాంలో జశ్వంత్ సింగ్ రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి ఆయన అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తోపాటు, అనేకమంది ప్రముఖులు జస్వంత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ తన సందేశంలో […]

జశ్వంత్‌ సింగ్‌ కు ప్రముఖుల ఘన నివాళి
Follow us

|

Updated on: Sep 27, 2020 | 12:30 PM

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌(82) ఈరోజు ఉదయం కన్నుమూశారు. దివంగత ప్రధాని వాజ్‌పేయి హయాంలో జశ్వంత్ సింగ్ రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి ఆయన అమోఘమైన సేవలు అందించారని కొనియాడారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తోపాటు, అనేకమంది ప్రముఖులు జస్వంత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ తన సందేశంలో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేసిన జస్వంత్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన సంతాప సందేశంలో జస్వంత్ తో తనకున్న అనుభవాన్ని గుర్తుకుతెచ్చుకున్నారు. జస్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.