భారత నేవీలోకి మరో కలికితురాయి.. గోవా చేరుకున్న అత్యాధునిక పొసిడాన్‌ 8ఐ యుద్ధ విమానం

భారత నావికా దళంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. దేశ భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ బారత సైన్యానికి అత్యాధునిక సంపదను చేకూరుస్తున్నారు.

భారత నేవీలోకి మరో కలికితురాయి.. గోవా చేరుకున్న అత్యాధునిక పొసిడాన్‌ 8ఐ యుద్ధ విమానం
Follow us

|

Updated on: Nov 19, 2020 | 8:28 PM

భారత నావికా దళంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. దేశ భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ బారత సైన్యానికి అత్యాధునిక సంపదను చేకూరుస్తున్నారు. సముద్ర జలాలపై గస్తీ తిరుగుతూ సుదూరం నుంచే శత్రు దేశాల జలాంతర్గాములను వేటాడే అత్యాధునిక పొసిడాన్‌ 8ఐ(పీ8ఐ) యుద్ధ విమానం భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరింది. అమెరికా రూపొందించిన ఈ విమానం బుధవారం గోవాలోని ఐఎన్‌ఎస్‌ హన్స నౌకా స్థావరంలో దిగింది.

అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రో ఆప్టిక్‌ సెన్సర్ల వ్యవస్థతో, రాడార్ల సాయంతో జలాంతర్గాముల ఆనుపానులు కనిపెట్టి, ఆయుధాలతో విరుచుకుపడటం దీని ప్రత్యేకత. 907 కి.మీ గరిష్ఠ వేగంతో, 1,200 నాటికల్‌ మైళ్ల పరిధి నిఘా సామర్థ్యంతో, ఏకధాటిగా నాలుగు గంటల పాటు గస్తీ తిరిగే సౌలభ్యంతో ఈ విమానాలు నౌకా దళానికి కీలకంగా మారాయి అగ్రరాజ్యం అందించనున్న నాలుగు పీ8ఐ యుద్ధ విమానాల్లో ఇది మొదటిది. ఈ నాలుగు విమానాల తయారీకి సంబంధించి 2016 జులైలో అమెరికాతో 1.1 బిలియన్‌ డాలర్లతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన మూడు పీ8ఐ విమానాలు వచ్చే ఏడాదికల్లా సిద్ధమవుతాయని రక్షణవర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటికే భారత్‌ వద్ద 8 పీ8ఐ విమానాలు అందుబాటులో ఉన్నాయి. హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా నౌకలు, జలాంతర్గాములపై నిఘా వేయడానికి వీటిని వినియోగిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో లడాఖ్‌ ప్రాంతంలో గస్తీ కోసమూ వీటిని ప్రస్తుతం వినియోగిస్తోంది నేవీ ఫోర్స్. అత్యాధునిక పొసిడాన్‌ 8ఐ(పీ8ఐ) యుద్ధ విమానాలు వచ్చి చేరడంతో భారత రక్షణ రంగం మరింత బలపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు