దేశంలో కొత్తగా 63,371 మందికి కరోనా.. 895 మంది మృతి
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్ట పడటంలేదు. రోజు రోజుకీ నమోదు అవుతున్న కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్ట పడటంలేదు. రోజు రోజుకీ నమోదు అవుతున్న కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. నిన్నటితో పోల్చితే కాస్త తక్కువమందికి కరోనా నిర్ధారణ అయ్యినట్లు అధికారు చెబుతున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో గురువారం 10,28,622 మంది నుంచి తీసిన నమూనాలను పరీక్షించగా.. 63,371 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469కు చేరుకుంది. ఇక 24 గంటల్లో 895 మంది కరోనా బారినపడి మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,12,161కి చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా 70,338 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 64,53,779 మంది మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 8,04,528 క్రియాశీల కేసులు ఉండగా ఎక్కువ శాతం హోం ఐసోలేషన్ లో ఉంటూ కరోనా చికిత్స పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది.
మరోవైపు రికవరీ రేటు క్రమంగా పెరుగుతూ వస్తుంది. దాదాపు 87.56 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 10.92 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని బులిటెన్లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,22,54,927 నమూనాలను పరీక్షించినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా, బయట తిరిగే వారు ఖచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.