యూఎస్ లో డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ చేస్తూ.. ప‌ట్టుబ‌డ్డ‌‌ భార‌త సంతతి వ్య‌క్తి..!

యూఎస్ లో ఓ భార‌త సంతతి వ్య‌క్తి మాద‌క ద్ర‌వ్యాలను అక్ర‌మంగా ర‌వాణా చేస్తూ ప‌ట్టుబ‌డ్డాడు. సుమారు రూ. 151 కోట్లు విలువ చేసే 1000 కిలోల గంజాయిని త‌న ట్ర‌క్కులో అక్ర‌మ‌మార్గంలో కెన‌డా నుంచి అమెరికాకు

యూఎస్ లో డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ చేస్తూ.. ప‌ట్టుబ‌డ్డ‌‌ భార‌త సంతతి వ్య‌క్తి..!
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 2:00 PM

యూఎస్ లో ఓ భార‌త సంతతి వ్య‌క్తి మాద‌క ద్ర‌వ్యాలను అక్ర‌మంగా ర‌వాణా చేస్తూ ప‌ట్టుబ‌డ్డాడు. సుమారు రూ. 151 కోట్లు విలువ చేసే 1000 కిలోల గంజాయిని త‌న ట్ర‌క్కులో అక్ర‌మ‌మార్గంలో కెన‌డా నుంచి అమెరికాకు త‌ర‌లిస్తున్న‌ ప్ర‌బజ్యోత్ న‌గ్రా(26) అనే భార‌త యువ‌కుడ్ని పోలీసులు అదు‌పులోకి తీసుకున్నారు. జూన్ 25న అర్ధ‌రాత్రి స‌మ‌యంలో త‌న ట్ర‌క్కుతో కెనడా నుంచి పీస్ బ్రిడ్జిపోర్ట్ ద్వారా అమెరికాలో ప్రవేశించడానికి ప్ర‌య‌త్నించాడు.

క‌స్ట‌మ్స్ అధికారులు, బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్‌ అడ్డుకుని వెహికల్ కార్గో ఇన్స్పెక్షన్ సిస్టం ద్వారా త‌నిఖీ చేయ‌డంతో ఈ భారీ మొత్తంలో గంజాయి ప‌ట్టుబ‌డింది. 8320 వాక్యూమ్ సీల్డ్ ప్యాకెజీల్లో 1000 కిలోల గంజాయి దొరికింద‌ని అధికారులు తెలిపారు. దీని విలువ 20 మిలియ‌న్ డాల‌ర్లు(సుమారు రూ. 151 కోట్లు) ఉంటుంద‌ని క‌స్ట‌మ్స్ అధికారులు వెల్ల‌డించారు. కాగా, డ్ర‌గ్స్ ర‌వాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన ప్ర‌బ‌జ్యోత్‌కు ప‌దేళ్ల నుంచి యావ‌జ్జీవ కార‌గార శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని అమెరిక‌న్ పోలీసులు తెలిపారు.

Also Read: ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో.. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!