సరిహద్దుల్లో మరింత అప్రమత్తం.. ఇజ్రాయోల్ డ్రోన్లతో నిఘా..
పాక్,చైనా సరిహద్లుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్ మరింత అప్రమత్తమవుతోంది. ఇక నిరంతరం సరిహద్లులో నిఘా ఉంచేందుకు డ్రోన్లను కూడా ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే పాక్ సరిహద్దుల్లో నిత్యం..
పాక్,చైనా సరిహద్లుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్ మరింత అప్రమత్తమవుతోంది. ఇక నిరంతరం సరిహద్లులో నిఘా ఉంచేందుకు డ్రోన్లను కూడా ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే పాక్ సరిహద్దుల్లో నిత్యం టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే గత జూన్ నెలలో గాల్వాన్ లోయలో భారత్-చైనా జవాన్ల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితి హీటెక్కింది. ఈ క్రమంలో సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్కు చెందిన డ్రోన్ల ద్వారా నిఘా పెట్టెందుకు రెడీ అయ్యింది. అంతేకాదా ఎదురు దాడి చేసేందుకు కూడా ఆయుధ సంపత్తిని మరింత పెంచేందుకు కూడా ప్రయత్నిస్తోంది.
ఇజ్రాయెల్ నుంచి స్పైక్ యాంటీ ట్యాంక్ మిస్సెల్స్, హిరాన్ నిఘా డ్రోన్లను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇవి భారత్కి చేరనున్నాయి. కాగా, ఇప్పటికే నేవీ, ఎయిర్ఫోర్స్, ఆర్మీ నిఘా, లక్ష్యాల వివరాల కోసం హిరాన్ మానవరహిత డ్రోన్లను వాడుతున్నాయి. అయితే ఎయిర్ ఫోర్స్ నిఘా అవసరాలను తీర్చేందుకు మరిన్ని హిరాన్ యూఏవీలు ఉండాలి. ఈ హీరాన్ డ్రోన్లు 10 కిలోమీటర్ల ఎత్తు ఎగరగలవు. అంతేకాదు నాన్స్టాప్గా 48 గంటలు ఎగురుతూ సమాచారాన్ని సేకరించగలవు.