అబుదాబిలో దారుణం.. భారతీయ జంట అనుమానాస్పద మృతి..
అబుదాబిలో దారుణం చోటుచేసుకుంది. ఓ భారతీయ జంట వారు నివసించే ప్లాట్లో అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. మృతులను కేరళలోని కోజికోడ్ జిల్లా నివాసులు జనార్దన్ పట్టిరీ(57), మినిజా(52)గా గుర్తించారు.
అబుదాబిలో దారుణం చోటుచేసుకుంది. ఓ భారతీయ జంట వారు నివసించే ప్లాట్లో అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. మృతులను కేరళలోని కోజికోడ్ జిల్లా నివాసులు జనార్దన్ పట్టిరీ(57), మినిజా(52)గా గుర్తించారు. గత 18 ఏళ్లుగా వీరు అబుదాబిలో నివసిస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసే పట్టిరీ ఇటీవల ఉద్యోగాన్ని కోల్పోయాడు. కారును సైతం అమ్మేశాడు. మినిజా ఛార్టెడ్ అకంటెంట్గా పనిచేస్తున్నారు. ఎవరితోనూ గొడవలు పెట్టుకునే వ్యక్తిత్వంగల వారు కాదు.
మరోవైపు.. విషాదమైన ఈ సంఘటన విస్మయానికి గురిచేసిందని కుటుంబ స్నేహితుడొకరు తెలిపారు. దంపతులకు ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. అబుదాబిలోనే చదివిన ఇతను ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. జులై 23వ తేదీన దంపతులు తమ ప్లాట్లో మృతిచెందిపడి ఉండగా పోలీసులు గమనించారు. వారి మరణానికి కారణం తెలియరాలేదు.
Read More: