దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగింది : కేంద్రం
దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల రికవరీ రేటు పెరిగినట్టు కేంద్రం తెలిపింది.
కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా దడ పుట్టిస్తుంది. రోజు రోజుకీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. అయితే అంతకంతకు కొవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల రికవరీ రేటు పెరిగినట్టు కేంద్రం తెలిపింది. రికవరీ రేటు 49.47 శాతం పెరిగి 1,47,194 మంది కోలుకున్నట్టు పేర్కొంది. ప్రపంచంలో అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్న దేశాలలో భారత్ నాలుగో స్థానానికి చేరుకోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అనంతరం త్వరగా కోలకుంటున్నారు బాధితులు. వరుసగా నాలుగో రోజు దేశంలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల్లో యూకేను భారత్ అధిగమించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,97,535 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 6,166 మంది కోలుకున్నట్టు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. లాక్డౌన్ ప్రారంభమైన మొదట్లో రెట్టింపు రేటు 17.4 రోజులుగా ఉండగా, ప్రస్తుతం అది 3.4 రోజులుగా ఉన్నట్టు పేర్కొంది. ప్రజల్లో కరోనా పట్ల అవగాహనతో జనం తీసుకున్న జాగ్రత్తల వల్ల త్వరగా కోలుకుంటున్నారని తెలిపింది.