పాక్ ఆర్మీకి భారత ఆర్మీ హెచ్చరిక

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్మీని భారత ఆర్మీ హెచ్చరించింది. బోర్డర్‌లో కశ్మీర్ ప్రజలను టార్గెట్ చేసుకుని కాల్పులు జరుపుతున్న పాక్ ఆర్మీని హెచ్చరించినట్టు భారత ఆర్మీ మీడియాకు వెల్లడించింది. సరిహద్దులో పాక్ ఆర్మీ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. దీంతో ఈ విషయాన్ని భారత్ సీరియస్‌గా తీసుకుని తొలి చర్యగా హెచ్చరికలు జారీ చేసింది. పుల్వామా ఉగ్రదాడి, అనంతరం భారత వైమానిక దాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో పాక్ ఆర్మీ సరిహద్దులో బరితెగిస్తోంది. ఎప్పటికప్పుడు మన […]

పాక్ ఆర్మీకి భారత ఆర్మీ హెచ్చరిక
Follow us

|

Updated on: Mar 07, 2019 | 7:34 AM

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్మీని భారత ఆర్మీ హెచ్చరించింది. బోర్డర్‌లో కశ్మీర్ ప్రజలను టార్గెట్ చేసుకుని కాల్పులు జరుపుతున్న పాక్ ఆర్మీని హెచ్చరించినట్టు భారత ఆర్మీ మీడియాకు వెల్లడించింది. సరిహద్దులో పాక్ ఆర్మీ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.

దీంతో ఈ విషయాన్ని భారత్ సీరియస్‌గా తీసుకుని తొలి చర్యగా హెచ్చరికలు జారీ చేసింది. పుల్వామా ఉగ్రదాడి, అనంతరం భారత వైమానిక దాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో పాక్ ఆర్మీ సరిహద్దులో బరితెగిస్తోంది. ఎప్పటికప్పుడు మన సైన్యం పాక్ కవ్వింపులను తిప్పికొడుతూనే ఉంది.