ధోని లేకపోతేనేం… పంత్ ఉన్నాడుగా!
ఐసీసీ ప్రపంచకప్లో టీమిండియా నిష్క్రమణపై కెప్టెన్ విరాట్కోహ్లీ స్పందించాడు. న్యూజిలాండ్ చేతిలో ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా మారిందని చెప్పాడు. తాము అంతర్జాతీయ ఆటగాళ్లమని, జరిగిన వాటికి చింతించకుండా ముందుకుసాగడంపై దృష్టిసారించామని తెలిపాడు. వెస్టిండీస్తో తొలి టీ20కి ముందు కోహ్లీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వెస్టిండీస్ పర్యటనకు ధోనీ లేకపోవడంపై స్పందిస్తూ అతడి అనుభవం టీమిండియాకి ఎంతో అవసరమని పేర్కొన్నాడు. ధోనీ లేని లోటు యువ వికెట్కీపర్, బ్యాట్స్మన్ రిషబ్పంత్కు చక్కటి అవకాశమని కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. మిడిలార్డర్లో పంత్ […]
ఐసీసీ ప్రపంచకప్లో టీమిండియా నిష్క్రమణపై కెప్టెన్ విరాట్కోహ్లీ స్పందించాడు. న్యూజిలాండ్ చేతిలో ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా మారిందని చెప్పాడు. తాము అంతర్జాతీయ ఆటగాళ్లమని, జరిగిన వాటికి చింతించకుండా ముందుకుసాగడంపై దృష్టిసారించామని తెలిపాడు. వెస్టిండీస్తో తొలి టీ20కి ముందు కోహ్లీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
వెస్టిండీస్ పర్యటనకు ధోనీ లేకపోవడంపై స్పందిస్తూ అతడి అనుభవం టీమిండియాకి ఎంతో అవసరమని పేర్కొన్నాడు. ధోనీ లేని లోటు యువ వికెట్కీపర్, బ్యాట్స్మన్ రిషబ్పంత్కు చక్కటి అవకాశమని కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. మిడిలార్డర్లో పంత్ రాణించాలని, అతడికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకు పంత్ కూడా సిద్ధంగా ఉన్నాడని, లోయర్ మిడిలార్డర్లో పంత్ తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకొని.. ధోనీ, పాండ్యలేని లోటును తీర్చాలని కోరాడు.
విండీస్ పర్యటనకు సెలక్టర్లు హార్దిక్పాండ్యకు విశ్రాంతినివ్వగా.. ధోనీ స్వతహాగా రెండు నెలలపాటు ఆటకు దూరమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లకు మంచి అవకాశం దొరికింది. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో యువ క్రికెటర్లకు అవకాశమిచ్చామని కోహ్లీ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశం దక్కిన యువ క్రికెటర్లు ఈ పర్యటనలో బాగా ఆడాలనుకుంటున్నారని చెప్పాడు. నేటి నుంచి టీమిండియా వెస్టిండీస్తో నెల రోజులపాటు తలపడనుంది. శనివారం, ఆదివారం రెండు టీ20 మ్యాచ్లు ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియంలో ఆడనుండగా.. ఈనెల 6న వెస్టిండీస్లో మూడో టీ20లో తలపడనుంది. ఆపై మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్లు అక్కడే ఆడనుంది.
MS Dhoni's absence is the perfect opportunity for @RishabhPant17 to gain experience and unleash his potential – #TeamIndia Captain @imVkohli ahead of the 1st T20I against West Indies.#WIvIND pic.twitter.com/1r3QjpuLZl
— BCCI (@BCCI) August 3, 2019