చెలరేగిన కోహ్లీ.. విండీస్పై టీమిండియా ఘనవిజయం
మూడు టీ20ల సిరీస్లో భాగంగా.. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. తొలుత తడబడ్డా.. ఆ తర్వాత.. ఫామ్లోకి వచ్చింది. విరాట్ కోహ్లీ 50 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి.. 94 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో 18.4 ఓవర్లలో […]
మూడు టీ20ల సిరీస్లో భాగంగా.. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. తొలుత తడబడ్డా.. ఆ తర్వాత.. ఫామ్లోకి వచ్చింది. విరాట్ కోహ్లీ 50 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి.. 94 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో 18.4 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత్ బ్యాటింగ్లో రాహుల్ 62, విరాట్ కోహ్లీ 94 నాటౌట్, పంత్ 18 పరుగులు చేశారు. మూడు టీ20 సిరీస్లో భాగంగా.. టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది.
India win!
Another wonderfully paced run-chase led by Virat Kohli, who also had some fun during his innings ?
The Indian captain hit 94*, his highest score In T20Is ? #INDvWI pic.twitter.com/v3bQcRjbMC
— ICC (@ICC) December 6, 2019