న్యూ ఇయర్ బోణీ కొట్టిన కోహ్లీ సేన…
ఇండోర్ వేదికగా.. శ్రీలంకతో జరుగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన.. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగుల చేసింది. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 17.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. టీమిండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ 32 బంతుల్లో ఆరు ఫోర్లతో 45 పరుగులు […]
ఇండోర్ వేదికగా.. శ్రీలంకతో జరుగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన.. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగుల చేసింది. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 17.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. టీమిండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ 32 బంతుల్లో ఆరు ఫోర్లతో 45 పరుగులు చేయగా.. శిఖర్ ధావన్ 29 బంతుల్లో రెండు ఫోర్ల సహాయంతో 32 పరుగులు చేసి శుభారంభాన్నిచ్చారు. అనంతరం వీరిద్దరూ ఔట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 26 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 34 పరుగులు చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ 17 బంతుల్లో ఓ ఫోర్, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. చివర్లో విజయానికి మరో 6 పరుగుల కావాల్సి ఉండగా.. శ్రేయస్ అయ్యర్ వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన రిశబ్ పంత్, కోహ్లీ మ్యాచును దిగ్విజయం ముగించారు.
ఇదిలా ఉంటే.. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. తొలి నుంచి భారత బౌలర్లు ఆధిపత్యాన్ని చలాయించారు. కట్టుదిట్టంగా బంతులేయడంతో శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయింది. కుశాల్ పెరీరా (34), అవిష్క ఫెర్నాండో(22) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. మిగతా బ్యాట్స్మెన్ అంతా విఫలమయ్యారు. ఇక భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, నవ్దీప్ సైని చెరో రెండు వికెట్లు తీశారు. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.