సఫారీలతో ఫస్ట్ టెస్టు: అనూహ్యంగా పంత్కు ఉద్వాసన.. గ్రౌండ్లోకి సాహా!
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో సత్తాచాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. రేపు విశాఖపట్టణం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ప్రాక్టీస్లో బిజీగా ఉన్న కోహ్లీసేన… సఫారీలపై గెలవాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జట్టులో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫైనల్ లిస్ట్లో యువవికెట్ కీపర్ రిషబ్ పంత్కు బదులుగా వృద్ధిమాన్ సాహాకు అవకాశం లభించింది. దీనిపై తాజాగా స్పందించిన కోహ్లీ… మొదటి టెస్టులో సాహా ఆడతాడని స్పష్టం చేశాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో ఘోరంగా విఫలమయ్యాడు పంత్. […]
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో సత్తాచాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. రేపు విశాఖపట్టణం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ప్రాక్టీస్లో బిజీగా ఉన్న కోహ్లీసేన… సఫారీలపై గెలవాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జట్టులో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫైనల్ లిస్ట్లో యువవికెట్ కీపర్ రిషబ్ పంత్కు బదులుగా వృద్ధిమాన్ సాహాకు అవకాశం లభించింది. దీనిపై తాజాగా స్పందించిన కోహ్లీ… మొదటి టెస్టులో సాహా ఆడతాడని స్పష్టం చేశాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో ఘోరంగా విఫలమయ్యాడు పంత్. రెండు మ్యాచ్ల్లో వరుసగా 4, 19 పరుగులు చేసి అందరిని డిసప్పాయింట్ చేశాడు. గత నెలలో జరిగిన వెస్టిండీస్ టెస్టు సిరీస్లోనూ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. కాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అవసరం ఉన్న నేపథ్యంలో జడేజా, అశ్విన్లు మొదటి టెస్టులో బరిలోకి దిగుతారని కోహ్లీ తెలిపాడు. స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఓపెనర్గా ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని అన్నాడు.
ఫైనల్ జట్టు వివరాలు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైప్ కెప్టెన్), చటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, అశ్విన్, ఆర్ జడేజా, వృద్ధిమాన్ సాహా(కీపర్), ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి
“We are looking forward to Rohit playing his natural game at the top” – @imVkohli ?? #TeamIndia #INDvSA @paytm pic.twitter.com/yCKPxhwSsu
— BCCI (@BCCI) October 1, 2019