పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం.. ఘోరంగా ఓడిన టీమిండియా..

అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 90 పరుగుల టార్గెట్‌ను

పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం.. ఘోరంగా ఓడిన టీమిండియా..
Follow us

|

Updated on: Dec 19, 2020 | 1:41 PM

India Vs Australia 2020: పింక్ బాల్ టెస్టుల్లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో ఇప్పటిదాకా ఆడిన 8 డే/నైట్ టెస్టుల్లోనూ ఆసీస్ అన్నింటిలోనూ విజయం సాధించింది. 90 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్ బ్యాట్స్‌మెన్.. ఆడుతూ పాడుతూ టార్గెట్‌ను సునాయాసంగా చేధించారు. ఓపెనర్ బర్న్స్(51*) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్ వేడ్(33) రాణించాడు. ఇక భారత్ బౌలర్లలో అశ్విన్‌కు ఒక వికెట్ దక్కింది.

కాగా, అంతమందు 9/1 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా.. మరో 27 పరుగులు జోడించి 36 రన్స్‌కు ఆలౌట్ అయింది. టెస్టుల్లో భారత్‌కు ఇదే అత్యల్ప స్కోర్. ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోర్ దాటలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో హేజల్‌వుడ్ ఐదు వికెట్లు, కమ్మిన్స్ నాలుగు వికెట్లు పడగొట్టారు. అటు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 244, ఆస్ట్రేలియా 191 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి విదితమే. కాగా, ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టిమ్ పైన్‌కు దక్కింది.