భారత్-ఆసీస్ టూర్ మూడో వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ.. భారత జట్టులో భారీమార్పులు..!

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో కాన్‌బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది.

భారత్-ఆసీస్ టూర్ మూడో వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ.. భారత జట్టులో భారీమార్పులు..!
Follow us

|

Updated on: Dec 02, 2020 | 9:34 AM

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో కాన్‌బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్, బౌలింగ్‌లో వైఫల్యాల కారణంగా ఓటమి పాలయ్యామని, నేటి పోరులో సత్తాచాటుతామని టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ అన్నాడు. మరోవైపు, వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని కంగారు జట్లు ఉవ్విళ్లురుతుంది. కాగా, భారత్ తుదిజట్టులో భారీమార్పులు జరిగాయి. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ స్థానంలో శుభ్‌మన్‌ గిల్ వచ్చాడు. సైని, షమి, చాహల్‌ స్థానాల్లో నటరాజన్, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్ జట్టులోకి చేరారు. ఎడమచేతి వాటం పేసర్‌ అయిన నటరాజన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు.

జట్ల వివరాలు: భారత్ః శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, టీ నటరాజన్‌

ఆస్ట్రేలియాః ఆరోన్ ఫించ్ (కెప్టెన్), లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్, మాక్స్‌వెల్, స్టాయినిస్‌, హెన్రిక్స్‌, అలెక్స్ కేరీ, కామెరన్‌ గ్రీన్‌, ఆస్టన్‌ అగర్, హేజిల్‌వుడ్‌, సీన్‌ అబాట్‌, జంపా