పాక్ దౌత్య అధికారులకు భారత్ సమన్లు..
పాకిస్తాన్ హైకమిషన్ ఉన్నత స్థాయి అధికారులకు భారత్ సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్లోని చారిత్రక కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా యాజమాన్యం మార్పు అంశాన్ని కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా...
India Summons Pakistan CDA : పాకిస్తాన్ హైకమిషన్ ఉన్నత స్థాయి అధికారులకు భారత్ సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్లోని చారిత్రక కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా యాజమాన్యం మార్పు అంశాన్ని కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. పాక్ హైకమిషన్ అధికారికి శుక్రవారం సమన్లు పంపింది. దీంతో ఢిల్లీలోని సౌత్ బ్లాక్కు పాక్ దౌత్యవేత్త చేరుకొన్నారు.
పాక్లోని కర్తార్పుర్ సాహిబ్ గురుద్వారా యాజమాన్య, నిర్వహణ బాధ్యతలను పాక్ ప్రభుత్వం ఏకపక్షంగా మార్చాలనుకుంటోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలు చూస్తున్న పాకిస్తాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ నుంచి సిక్కుయేతర సంస్థ అయిన కాందిశీకుల ఆస్తుల ట్రస్టు బోర్డుకు బదలాయించాలని నిర్ణయించింది.
దీనిపై భారత్లోని సిక్కు సంఘాలతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తీవ్రంగా తీవ్రంగా స్పందించాయి. సిక్కుల మత విశ్వాసాలకు వ్యతిరేకంగా, మైనార్టీల హక్కులను హరించేలా పాక్ నిర్ణయం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సిక్కు సమాజంతో చర్చించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ మండిపడుతున్న విషయం తెలిసిందే.