Successfully Test Air Missile : మరో మధ్యంతర క్షిపణి ప్రయోగం సక్సెస్..మొబైల్ లాంఛర్ ద్వారా పరీక్షించన డీఆర్డీఓ..
ఒడిశా తీరంలో మరో మధ్యంతర క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. భూమి నుంచి గాలిలోని లక్ష్యాలను చేధించే మధ్య శ్రేణి క్షిపణిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఈ ప్రయోగాన్ని..
Successfully Test Air Missile : ఒడిశా తీరంలో మరో మధ్యంతర క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. భూమి నుంచి గాలిలోని లక్ష్యాలను చేధించే మధ్య శ్రేణి క్షిపణిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఈ ప్రయోగాన్ని విజయంతంగా నిర్వహించింది. ఒడిశా బాలాసోర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మొబైల్ లాంఛర్ ద్వారా మధ్యశ్రేణి క్షిపణిని ప్రయోగించారు. భారత సైన్యం అవసరాల కోసం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఏజెన్సీతో కలిసి ఈ క్షిపణిని డీఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది.
ముందుగా ‘బాన్షీ’ పేరుతో ఉండే మానవ రహిత విమానాన్ని గాల్లోకి పంపించారు. ఆ తర్వాత మధ్యతరహా క్షిపణి బాన్షీని కచ్చితత్వంతో చేధించిందని రక్షణశాఖ వెల్లడించింది. ఈ మధ్యశ్రేణి క్షిపణిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) తయారుచేస్తోంది. ఈ క్షిపణిని సైన్యంలో చేర్చితే రక్షణ బలగాల పోరాట సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని రక్షణశాఖ తెలిపింది.
#WATCH Defence Research and Development Organisation (DRDO) today carried out the trials of the Medium Range Surface to Air missile systems developed for the Indian Army pic.twitter.com/CC6OLgaeyV
— ANI (@ANI) December 23, 2020