కరోనా ప్రతాపం.. ఒక్క రోజులో 7964 కొత్త కేసులు
భారతావనిపై కరోనా ప్రతాపం కొనసాగుతోంది. తాజాగా 24 గంటల్లో 7964 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నిర్ధారణ అయిన కేసుల్లో ఇదే అత్యధికం. ఏడు వేలకు పైగా కేసులు నమోదు కావడం వరుసగా ఇది రెండో రోజు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,73,763కు పెరిగింది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,73,763 దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 86,422 దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మొత్తం 4,971 కరోనా […]
భారతావనిపై కరోనా ప్రతాపం కొనసాగుతోంది. తాజాగా 24 గంటల్లో 7964 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నిర్ధారణ అయిన కేసుల్లో ఇదే అత్యధికం. ఏడు వేలకు పైగా కేసులు నమోదు కావడం వరుసగా ఇది రెండో రోజు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,73,763కు పెరిగింది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,73,763 దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 86,422 దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మొత్తం 4,971 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారు 82,369
ఇక కొత్తగా మరో 265 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 4,971కి చేరింది. అయితే 82,369 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 86,422 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే గడిచిన 24 గంటల్లోనే 11,264 మంది కోలుకోవడం కొద్దిగా ఊరట కలిగిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపింది.