బంగ్లాదేశ్ ప్రధాని హసీనాకు ప్రధాని మోదీ అరుదైన జన్మదిన కానుక
విదేశీ ప్రముఖులను ఆకట్టుకోవడంలో ప్రధాని మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని పుట్టినరోజుకు అరుదైన గిఫ్ట్ ఇచ్చి సంతోషపరిచారు.
విదేశీ ప్రముఖులను ఆకట్టుకోవడంలో ప్రధాని మరోసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని పుట్టినరోజుకు అరుదైన గిఫ్ట్ ఇచ్చి సంతోషపరిచారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పుట్టినరోజు పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశంతోపాటు అరుదైన బహుమతిని పంపించారు. హసీనా తండ్రి బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబూర్ రెహ్మాన్ 1972లో భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా తీసిన అరుదైన వీడియో ఫుటేజీని గిఫ్ట్ గా పంపించారు. ఈ బహుమతిని బంగ్లాదేశ్ లో భారత హైకమిషనర్ రివా గంగూలీ దాస్ వ్యక్తిగతంగా హసీనాకు అందించారు. ముజిబుర్ రెహ్మాన్ నాటి పర్యటనలో స్నేహం, సహకారం, శాంతిపై ఇండో-బంగ్లా ఒప్పందంపై సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన పర్యటన విశేషాలతో రూపొందించిన వీడియోను అందజేశారుజ
1971లో పాకిస్తాన్ తో యుద్ధం అనంతరం బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత రెహ్మాన్ 1972 మార్చిలో భారతదేశంలో పర్యటించారు. ‘‘మీ దూరదృష్టి, నాయకత్వం వల్ల బంగ్లాదేశ్ అపారమైన సామాజిక,ఆర్థిక పరివర్తనను సాధించడంలో సహాయపడింది… మా ద్వైపాక్షిక సంబంధాలకు మీ సహకారం ఎంతో ఆకట్టుకుంది’’ అని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బంగ్లాదేశ్ ప్రధాని హసీనా విధానాలను ప్రశంసిస్తూ లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన బహుమతిని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత హైకమిషనర్ రివా గంగూలీ దాస్ వ్యక్తిగతంగా హసీనాకు అందజేశారు.
HC Smt. Riva Ganguly Das (@rivagdas) paid a farewell call on Hon’ble PM of #Bangladesh, H.E. Sheikh Hasina today. She handed over a letter from Hon’ble PM, H.E. Shri Narendra Modi to Bangladesh PM greeting on her birth anniversary and also presented a bouquet on his behalf. 1/3 pic.twitter.com/hnetIx0mru
— India in Bangladesh (@ihcdhaka) September 27, 2020