గుడ్‌న్యూస్.. త్వరలో భారత్-పాక్ ఢీ.. వేదిక ఇదే..!

భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో అని వేచిచూస్తున్న అభిమానులకు దాదా గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఆసియా కప్.. దుబాయ్‌లో జరుగుతుందని తెలిపారు.

గుడ్‌న్యూస్.. త్వరలో భారత్-పాక్ ఢీ.. వేదిక ఇదే..!
Follow us

|

Updated on: Feb 29, 2020 | 7:09 AM

భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో అని వేచిచూస్తున్న అభిమానులకు దాదా గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఆసియా కప్.. దుబాయ్‌లో జరుగుతుందని తెలిపారు. అంతేకాదు.. ఈ కప్‌లో భారత్, పాక్ జట్లు తలపడతాయని కూడా గంగూలీ స్పష్టం చేశారు.

వాస్తవానికి ఈ సారి జరిగే ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే సెక్యూరిటీ పరమైన కారణాల వల్ల పాకిస్థాన్‌కు భారత జట్టు పంపేదే లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. దీంతో ఆసియాకప్ వేదిక కాస్త దుబాయ్‌కి మారిపోయింది. మార్చి 3న జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్తున్న గంగూలీ.. ఈడెన్ గార్డెన్‌లో మాట్లాడిన దాదా.. ఈ విషయాన్ని వెల్లడించారు.

కాగా.. భారత్‌, పాక్‌‌ జట్లు చివరి సారిగా 2012-13 ద్వైపాక్షిక సీరీస్‌లో ఆడాయి. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య విభేదాల తలెత్తిన నేపథ్యంలో మరో సిరీస్ ఇప్పటివరకు జరగలేదు. ఐసీసీ వేదికగా జరిగిన ప్రధానమైన టోర్నమెంట్స్‌లో మాత్రమే తలపడుతున్నాయి.