కళ్ళు చెదిరే కోట్ల డబ్బు …నిజాం వారసులకు దక్కేనా ?

భారత-పాకిస్తాన్ దేశాల మధ్య హైదరాబాద్ నిజాం కు చెందిన కోట్లకొద్దీ సొమ్ము (సుమారు 35 మిలియన్ పౌండ్లు) కు సంబంధించిన వివాదం పీక్ స్టేజీకి చేరింది. అది 1947 లో భారత, పాకిస్తాన్ దేశాల మధ్య విభజన జరిగిన సమయం . రెండు దేశాలూ విడిపోయిన కాలం. ఈ సొమ్మును లండన్లోని నాట్ వెస్ట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుకు తాము ఆయుధాలు అందజేశామని, అందువల్ల తమకే ఈ డబ్బు చెందాలని […]

కళ్ళు చెదిరే కోట్ల డబ్బు ...నిజాం వారసులకు దక్కేనా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 27, 2019 | 2:26 PM

భారత-పాకిస్తాన్ దేశాల మధ్య హైదరాబాద్ నిజాం కు చెందిన కోట్లకొద్దీ సొమ్ము (సుమారు 35 మిలియన్ పౌండ్లు) కు సంబంధించిన వివాదం పీక్ స్టేజీకి చేరింది. అది 1947 లో భారత, పాకిస్తాన్ దేశాల మధ్య విభజన జరిగిన సమయం . రెండు దేశాలూ విడిపోయిన కాలం. ఈ సొమ్మును లండన్లోని నాట్ వెస్ట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుకు తాము ఆయుధాలు అందజేశామని, అందువల్ల తమకే ఈ డబ్బు చెందాలని పాకిస్థాన్ కొత్త పల్లవి ఎత్తుకుంది. అయితే పాక్ వాదన సరికాదని, ఈ సొమ్ము తమకే చెందాలని నిజాం వారసులైన ప్రిన్స్ ముకరం జా, ఆయన తమ్ముడు ముఫక్కం జా కోర్టుకెక్కారు. 1948 లో అప్పటి హైదరాబాద్ నిజాం సుమారు 1,007,940 పౌండ్లను బ్రిటన్లోని పాక్ హైకమిషనర్ అకౌంటుకు బదిలీ చేయడంతోనే వివాదం మొదలైంది. ఆ డబ్బు ఏ ఏటికా ఏడు పెరుగుతూ వచ్చింది. కాగా-తమ తాత గిఫ్టుగా ఇచ్చిన ఈ నిధులకోసం ఎనిమిదో నిజాం, ఆయన సోదరుడు దశాబ్దాల తరబడి వేచి చూశారని, కానీ పాకిస్థాన్ 70 ఏళ్లుగా అడ్డు తగులుతోందని వారసుల తరఫు న్యాయవాది పాల్ హెవిట్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం టర్కీలో ఉన్న ఈయన .. పాకిస్థాన్ వాదన అర్థరహితమన్నారు.1947 ప్రాంతంలో ‘ భారత ఆక్రమణను తాము ఎదుర్కొన్నామని చెబుతున్న ‘ పాకిస్థాన్ కు అసలు ఈ సొమ్ము ఎలా చెందుతుందని ఆయన ప్రశ్నించారు. అటు- లండన్ కోర్టులో జస్టిస్ మార్కస్ స్మిత్ రెండువారాలుగా ఉభయ పక్షాల వాదనలను ఆలకిస్తున్నారు. స్వర్గీయ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కు చెందిన ఈ నిధులు నిజానికి ఎవరికి చెందాల్సి ఉందని ఆయన ప్రశ్నించారు. చట్టానికి లోబడి తాము తీర్పు ఇవ్వాల్సి ఉందని, కోట్ల కొద్దీ సొమ్ము విషయంలో ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా-భారతీయ కరెన్సీలో దాదాపు 309 కోట్లకు పైగా..కళ్ళు చెదిరే రీతిలో లండన్ బ్యాంకులో మూలుగుతున్న ఈ నిధుల విషయంలో భారత ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తున్నది చూడాల్సి ఉంది. పేరుకు ఇది నిజాం వారసులకు చెందాల్సి ఉన్నా.. పాకిస్తాన్ తో ఈ వ్యవహారం ముడిపడిఉన్న సంగతి గమనార్హం. . అసలే ఈ పొరుగు దేశంతో సత్సంబంధాలు అంతగా లేని ఈ తరుణంలో అక్కడి హైకమిషనర్ లండన్ కోర్టులో ఈ కేసు విచారణను ప్రభావితం చేస్తారా అన్న అంశాన్ని న్యాయ నిపుణులు లేవనెత్తుతున్నారు. పాక్-బ్రిటన్ మధ్య గల సంబంధాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..