కరోనా వైరస్ వ్యాక్సీన్, ఇండియాపైనే ప్రపంచం చూపు, బిల్ గేట్స్
కరోనా వైరస్ వ్యాక్సీన్ గురించి ప్రపంచమంతా ఇండియావైపే చూస్తోందని మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్, బిలియనీర్ బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్య చేశారు. గ్లోబల్ గా ఆ దేశమే వ్యాక్సీన్ ఉత్పత్తిలో ముందంజలో ఉందని ఆయన చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సీన్ ఉత్పత్తిలో..
కరోనా వైరస్ వ్యాక్సీన్ గురించి ప్రపంచమంతా ఇండియావైపే చూస్తోందని మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్, బిలియనీర్ బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్య చేశారు. గ్లోబల్ గా ఆ దేశమే వ్యాక్సీన్ ఉత్పత్తిలో ముందంజలో ఉందని ఆయన చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సీన్ ఉత్పత్తిలో మాకు ఇండియా నుంచి సహకారం అవసరం.. వరల్డ్ అంతా ఇండియావైపే చూస్తోంది.. వర్ధమాన దేశాల్లో భారత దేశం ఈ సామర్థ్యాన్ని సంతరించుకుంది అని ఆయన ప్రశంసించారు. బహుశా వచ్చే ఏడాది ఇండియాలో ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి రావచ్ఛునని ఆశిస్తున్నామన్నారు. ఇది భారీ స్థాయిలో ఉంటుంది. సురక్షితమైనది కూడా అని భావిస్తున్నాం అని బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఇండియాలో ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ వ్యాక్సీన్ తో బాటు మూడు వ్యాక్సీన్లు క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. కోవిడ్-19 వ్యాక్సీన్ ఉత్పత్తి త్వరగా జరిగేలా చూసేందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ పూణే లోని సీరం ఇన్స్ టి ట్యూట్ తో భాగస్వామ్య పాత్ర వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే బిల్ గేట్స్ భారత వ్యాక్సీన్ పై ప్రశంసల వర్షం కురిపించినట్టు కనిపిస్తోంది.