ఇండియాలో కరోనా కల్లోలం..దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 12573
దేశంలో కరోనా వీరవిహారం చేస్తోంది. లాక్డౌన్ ముగిసి అన్ లాక్ మొదలవ్వడంతో.. వేగంగా విస్తరిస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా... 24 గంటల్లో 13,586 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది.
దేశంలో కరోనా వీరవిహారం చేస్తోంది. లాక్డౌన్ ముగిసి అన్ లాక్ మొదలవ్వడంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా… 24 గంటల్లో 13,586 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది. ఒక రోజు వ్యవధిలో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,80,532కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 163248గా ఉంది. ఇక కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 12,573కు చేరింది. దేశవ్యాప్తంగా వ్యాధి నుంచి ఇప్పటివరకు 2,04,710 మంది కోలుకున్నారు. కాగా మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది. ఇప్పటివరకు అక్కడ 1,20,504 కేసులు నమోదయ్యాయి. 5751 మంది కరోనాతో చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీ కరోనా కేసుల విషయంలో సెకండ్ ప్లేసులో ఉంది. కోవిడ్-19 కారణంగా ఢిల్లీలో ఇప్పటివరకు 1969 మంది అక్కడ ప్రాణాలు విడిచారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ భారీగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి.