దేశంలో కరోనా కల్లోలం, 24 గంటల్లో 1,141 మరణాలు
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,141 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,141 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 5,818,570కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 81వేల మందికిపైగా వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
మొత్తం కేసులు : 58,18,570
కొత్త కేసులు : 86,052
ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు : 9,70,116
మొత్తం మృతుల సంఖ్య :92,290
ఇక రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, రికవరీ రేటు క్రమక్రమంగా పెరగడం కాస్త ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 81శాతం దాటగా, డెత్ రేటు 1.59శాతంగా ఉంది. అయితే, ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్న వారిలో దాదాపు 70శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది.
Also Read :
వ్యాక్సిన్ విషయంలో మరో ముందడుగు, ఇకపై ‘హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ !