దేశంలో కరోనా కల్లోలం, కొత్తగా 92,071 కేసులు
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 90వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 92,071 మంది వైరస్ సోకింది.
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 90వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 92,071 మంది వైరస్ సోకింది. మరో 1,136 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు విడిచారు. కొత్తగా 77,512 మంది వ్యాధి బారి నుంచి రికవర్ అయ్యారు. దీంతో దేశంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 37,80,107కు చేరింది.
కొత్త కేసులు 77,512 మొత్తం కేసులు 48,46,427
కొత్త మరణాలు 1,136 మొత్తం మరణాలు 79,722
ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 9,86,598
పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతన్నప్పటికీ, రికవరీల సంఖ్య కూడా భారీగా పెరగడం ఊరటనిచ్చే అంశం. రికవరీ రేటు కూడా 78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అటు డెత్ రేటు క్రమంగా తగ్గుతూ 1.64 శాతానికి చేరింది.
Also Read :