దేశంలో కరోనా కల్లోలం… 24 గంటల్లో 14,516 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వీరవిహారంచేస్తోంది. తాజాగా 24 గంటల్లో అత్యధికంగా 14,516 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,048కు చేరింది.
దేశంలో కరోనా వీరవిహారంచేస్తోంది. తాజాగా 24 గంటల్లో అత్యధికంగా 14,516 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,048కు చేరింది. నిన్న మరో 375 మంది కరోనాతో ప్రాణాలు విడువగా..మొత్తం మరణాల సంఖ్య 12,948కి చేరింది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య ప్రభుత్వాలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇదే క్రమంలో శుక్రవారం వ్యాధి బారి నుంచి 9,120 మంది రికవరీ అవ్వడంతో… మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2,13,830కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,68,269గా ఉంది.,
కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 1,24,331 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 54,449, ఢిల్లీలో 53,116, గుజరాత్లో 26,141 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసుల సంఖ్య కలవరపెడుతోంది.