30 సెకండ్లలో కరోనా ర్యాపిడ్ టెస్ట్..!
ఇజ్రాయెల్ సాంకేతిక నైపుణ్యాన్ని భారతదేశ భారీ ఉత్పత్తి సామర్థ్యాలతో విలీనం చేస్తూ, ఇరు దేశాల నిపుణులు చేతులు కలిపారు. ఈ క్రమంలో శరీరంలో కరోనా ఉనికిని ముప్పై సెకండ్లలోనే తెలియజేసే ప్రత్యేక కొవిడ్-19 ర్యాపిడ్ టెస్టు
Rapid testing for Coronavirus: ఇజ్రాయెల్ సాంకేతిక నైపుణ్యాన్ని భారతదేశ భారీ ఉత్పత్తి సామర్థ్యాలతో విలీనం చేస్తూ, ఇరు దేశాల నిపుణులు చేతులు కలిపారు. ఈ క్రమంలో శరీరంలో కరోనా ఉనికిని ముప్పై సెకండ్లలోనే తెలియజేసే ప్రత్యేక కొవిడ్-19 ర్యాపిడ్ టెస్టు సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు భారత్-ఇజ్రాయెల్ చేతులు కలిపాయి. సాంకేతికత అభివృద్ధి కోసం ఇజ్రాయెల్ రక్షణ శాఖలోని డెరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ ఆండ్ డెవలప్మెంట్ (డీడీఆర్డీ), భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)తో కలిసి పనిచేయనున్నది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది.
Also Read: హైదరాబాద్కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం..