india vs australia: రెండు టెస్టుల్లో రెండు రనౌట్లు… కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన భారత కెప్టెన్లు…
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో భారత్ కెప్టెన్ల రనౌట్లు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. సింగిల్స్ కోసం ఆరాటపడుతూ... వికెట్ను సమర్పించుకుంటున్నారు.
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో భారత్ కెప్టెన్ల రనౌట్లు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. సింగిల్స్ కోసం ఆరాటపడుతూ… వికెట్ను సమర్పించుకుంటున్నారు. మొదటి టెస్టులోనూ, రెండో టెస్టులోనూ అదే సీన్ రిపీట్ అవడంతో భారత అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సేమ్ టు సేమ్…
అడిలైడ్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్టులో రహానె సింగిల్ కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ రనౌట్ అయ్యాడు. దీంతో అప్పటివరకు మంచి స్థితిలో కనిపించిన టీమిండియా తక్కువ స్కోరుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా మొదటి టెస్టులో ఓడిపోయింది. తాజాగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులోనూ భారత్ని సోమవారం అదే సింగిల్ వెంపర్లాట మళ్లీ దెబ్బతీసింది. ఈసారి కెప్టెన్గా ఉన్న అజింక్య రహానె బాధితుడయ్యాడు. దీంతో టీమిండియా కేవలం 131 పరుగుల ఆధిక్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టెస్టుల్లో సింగిల్ కోసం భారత్ ప్రయత్నిస్తూ.. అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ల వికెట్లని కీలక సమయాల్లో చేజార్చుకుంటుండటం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.