తమిళనాడులో బయటపడుతోన్న నోట్ల కట్టలు..
ఎన్నికల వేళ తమిళనాడు రాష్ట్రంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడుతోన్నాయి. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడడం సంచలనం రేపుతోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు.. ఓటర్లకు పంచేందుకు భారీగా నగదును సీక్రెట్గా తరలిస్తున్నాయి. తమిళనాడులోని తుత్తుక్కుడిలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. తిరుచందూరులో జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల నగదు, 10 కిలోల బంగారు నాణేలు లభ్యమయ్యాయి. […]
ఎన్నికల వేళ తమిళనాడు రాష్ట్రంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడుతోన్నాయి. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడడం సంచలనం రేపుతోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు.. ఓటర్లకు పంచేందుకు భారీగా నగదును సీక్రెట్గా తరలిస్తున్నాయి.
తమిళనాడులోని తుత్తుక్కుడిలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. తిరుచందూరులో జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల నగదు, 10 కిలోల బంగారు నాణేలు లభ్యమయ్యాయి. ఏడీఎంకే మద్దతు దారుడు, కాంట్రాక్టర్ సెబాస్టియన్ ఇంట్లో జరిపిన దాడుల్లో లభ్యమైన 15 కోట్ల రూపాయల వీడియోలను ఐటీ అధికారులు మీడియాకు విడుదల చేశారు. ఈ కరెన్సీ వీడియోలిప్పుడు తమిళనాట సంచలనంగా మారాయి.
పెరంబుదూర్లో కూడా భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఎలక్షన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో 2 కోట్ల 10 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. అయితే ఈసీ తనిఖీల్లో పట్టుబడ్డ ఈ నగదు.. వీసీకే పార్టీకి చెందిన ఓ నేతదిగా పోలీసులు గుర్తించారు. ఇనుప ట్రంకు పెట్టెల్లో ఉన్న నగదును ఈసీ అధికారులు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు.