ఇది…పురి విప్పిన సెక్స్ రాకెట్.. ‘హనీట్రాప్’ లో మరెంతమందో..?
మధ్యప్రదేశ్ లో బయట పడిన హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ దేశంలో సంచలనం రేకెత్తిస్తోంది. డజను మంది సీనియర్ అధికారులు, ఎనిమిది మంది మాజీ మంత్రులు, ఇంకా ఎంతోమంది ఘరానా వ్యక్తుల ‘ తెరచాటు వ్యవహారం ‘ ఈ రాజకీయ వ్యవస్థకు పట్టిన ‘ గబ్బు ‘ ను ఎత్తి చూపు తోంది. (ఓ మాజీ సీఎం, మాజీ గవర్నర్ తో బాటు ఇంకా పలువురికి ఈ సెక్స్ రాకెట్ తో లింక్ ఉన్నట్టు ఇదివరకే వార్తలు […]
మధ్యప్రదేశ్ లో బయట పడిన హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ దేశంలో సంచలనం రేకెత్తిస్తోంది. డజను మంది సీనియర్ అధికారులు, ఎనిమిది మంది మాజీ మంత్రులు, ఇంకా ఎంతోమంది ఘరానా వ్యక్తుల ‘ తెరచాటు వ్యవహారం ‘ ఈ రాజకీయ వ్యవస్థకు పట్టిన ‘ గబ్బు ‘ ను ఎత్తి చూపు తోంది. (ఓ మాజీ సీఎం, మాజీ గవర్నర్ తో బాటు ఇంకా పలువురికి ఈ సెక్స్ రాకెట్ తో లింక్ ఉన్నట్టు ఇదివరకే వార్తలు వచ్చాయి). తాజాగా వెయ్యికి పైగా సెక్స్ చాట్ క్లిప్ లు, వీడియోలు, ఆడియోలు పోలీసు దాడుల్లో లభ్యమయ్యాయి. నిందితుల కంప్యూటర్లు, లాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లలో వీటిని ఖాకీలు కనుగొన్నారు. ‘ క్విడ్ ప్రోకో ‘ యవ్వారంగా దీన్ని పోలీసులు అభివర్ణిస్తున్నారు. అంటే రాజకీయ గుట్టుమట్లను ఈ పొలిటికల్ లీడర్ల నుంచి, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులనుంచి రాబట్టేందుకు యువతులను వారికి ‘ ఎర ‘ వేసేవారని భావిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా ఈ యువతులకు కార్లు, ఉద్యోగాలు ఇస్తామని ప్రలోభపెట్టేవారట. దీన్నే ‘ హానీ ట్రాప్ ‘ అని కూడా వ్యవహారిస్తున్నారు. ఈ దందాకు సంబంధించి అయిదుగురు మహిళలు.. కొంతమంది సెక్స్ వర్కర్లను, కాలేజీ విద్యార్థినులను వారి వద్దకు పంపేవారని తెలిసింది. 200 కు పైగా మొబైల్ ఫోన్ కాంటాక్టులను కూడా పోలీసులు కనుగొన్నారు. ఈ స్కాండల్ కేవలం మధ్యప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాదని, కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా ఇది వ్యాపించిందని తెలుస్తోంది.ఈ ‘ మకిలి దందా ‘ పై దర్యాప్తునకు సంజీవ్ షమి అనే అధికారి నేతృత్వాన ప్రభుత్వం ‘ సిట్ ‘ ఏర్పాటు చేసింది.
ఇప్పటికే పదిమందికి పైగా అధికారులను ‘ సిట్ ‘ విచారించింది. కెమెరాలో పట్టుబడిన పొలిటిషియన్లలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందినవారున్నారు. కాగా-శ్వేతా జైన్ , బర్ఖా సోనీ, ఆర్తి దయాళ్ అనే మహిళలతో బాటు 18 ఏళ్ళ ఓ కాలేజీ అమ్మాయిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడినవారిలో ఆర్తి దయాళ్ కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఈ మహిళల్లో బర్ఖా సోనీ.. కాంగ్రెస్ ఐటీ విభాగం మాజీ అధికారి అమిత్ సోనీ భార్య అని తెలిసింది. ఢిల్లీలో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తూ.. బిజేంద్ర ప్రతాప సింగ్ అనే బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని శ్వేతా జైన్ ఈ దందా జరిపేదట. అంటే ఆ స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఈ తెరచాటు బాగోతం నడిచేదని పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో ఓ ప్రముఖ రాజకీయ నేతతో ఈమెకు నిత్యం కాంటాక్ట్ ఉండేదని సమాచారం. అనేకమంది కాలేజీ విద్యార్థినులను ఈమె ప్రలోభపెట్టి ఈ ముగ్గులోకి దింపుతూ వచ్చింది. ధనవంతులు, రాజకీయ నాయకులనుంచి భారీగా డబ్బులు గుంజి వీరిని వారికి ‘ ఎర ‘ గా వేసేదట. శ్వేతా జైన్ గత కొన్నేళ్లుగా ముఠాలు నడుపుతూ కోట్లకొద్దీ సొమ్ము ఆర్జించినట్టు భావిస్తున్నారు. వారికి తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చిందని తెలిసింది. వెయ్యికి పైగా వీడియో క్లిప్పులను తయారు చేసిన ఈ బడా కిలాడీ లేడీ వ్యవహారం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.