కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా పోలింగ్.. 75 శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడి…
కేరళలో డిసెంబర్ 8న జరిగిన తొలి దశ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. తొలి దశ పోలింగ్లో 75 శాతం నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
కేరళలో డిసెంబర్ 8న జరిగిన తొలి దశ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. తొలి దశ పోలింగ్లో 75 శాతం నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. కేరళ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు మొగ్గు చూపారు.
మొదటి దశలో తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పతనమిట్ట, ఇడుక్కి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. రెండవ దశ పోలింగ్ డిసెంబర్ 12 న, చివరి దశ పోలింగ్ డిసెంబర్ 14 న జరుగనున్నది. డిసెంబర్ 16 న కౌంటింగ్ జరుగుతుంది. పాలక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్), ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్), బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) మధ్యే ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, మూడు దశాబ్దాలకు పైగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రత్యామ్నాయంగా అధికారాన్ని పంచుకున్నాయి. అయితే ఈసారి బీజేపీకి అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.