చిచ్చు రేపిన లెటర్.. కాంగ్రెస్, బీజేపీ ట్విటర్ వార్

కెఫె కాఫీ డే ఓనర్ వి.జి. సిధ్ధార్థ మృతి చెంది 36 గంటలు గడిచాయి. అప్పుడే కర్ణాటకలో రెండు ప్రధాన పార్టీల మధ్య ట్విటర్ వార్ ప్రారంభమైంది. కాంగ్రెస్, బీజేపీ ఆయన ఆత్మహత్యను ‘ రాజకీయం ‘ చేయడానికి నడుం కట్టాయి. పొలిటికల్ దుమారం రేపేందుకు రెడీ అయ్యాయి. ఓ ఆదాయం పన్ను అధికారి వేధింపులకు తాను గురయ్యానని, మంచి వ్యాపారవేత్తను కాలేకపోయానని సిధ్ధార్థ తన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. (అయితే ఈ ఆరోపణను ఇన్ […]

చిచ్చు రేపిన లెటర్.. కాంగ్రెస్, బీజేపీ ట్విటర్ వార్
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2019 | 12:43 PM

కెఫె కాఫీ డే ఓనర్ వి.జి. సిధ్ధార్థ మృతి చెంది 36 గంటలు గడిచాయి. అప్పుడే కర్ణాటకలో రెండు ప్రధాన పార్టీల మధ్య ట్విటర్ వార్ ప్రారంభమైంది. కాంగ్రెస్, బీజేపీ ఆయన ఆత్మహత్యను ‘ రాజకీయం ‘ చేయడానికి నడుం కట్టాయి. పొలిటికల్ దుమారం రేపేందుకు రెడీ అయ్యాయి. ఓ ఆదాయం పన్ను అధికారి వేధింపులకు తాను గురయ్యానని, మంచి వ్యాపారవేత్తను కాలేకపోయానని సిధ్ధార్థ తన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. (అయితే ఈ ఆరోపణను ఇన్ కమ్ టాక్స్ వర్గాలు ఖండించాయి. సిధ్ధార్థ సంతకానికి, ఈ లేఖలోని సంతకానికి మధ్య ఎంతో తేడా ఉన్నాయని తెలిపాయి. 2017 లో తన కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగిన సందర్భంలో లెక్కల్లో చూపని ఆదాయాన్ని దాచినట్టు ఆయన అంగీకరించారని ఈ వర్గాలు గుర్తు చేశాయి).

కాగా-సిధ్ధార్థ మృతి దురదృష్టకరమని, ఐటీ అధికారుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని రాష్ట్ర కాంగ్రెస్ తన ట్విటర్ లో ఆరోపించింది. దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవర్గాలు క్రమేపీ కుప్పకూలుతున్నాయనడానికి సిధ్ధార్థ సూసైడే నిదర్శనమని ఈ పార్టీ పేర్కొంది. ఇండియాలో ‘ టాక్స్ టెర్రర్, ‘, ఎకానమీ కొలాప్స్ ఫలితంగా ఔత్సాహిక పారిశ్రామికవర్గాలు ఇలా డీలా పడుతున్నాయని విమర్శించింది. యూపీఏ హయాంలో వెలుగు వెలిగిన కంపెనీలు ఇప్పుడు మూత పడుతున్నాయి. అనేకమంది నిరుద్యోగులుగా మారుతున్నారు.. అని కాంగ్రెస్ తన ట్విట్టర్లో దుయ్యబట్టింది. దీనిపై తీవ్రంగా స్పందించిన బీజేపీ.. అవకాశవాద రాజకీయాలు ‘ వెల్లువెత్తుతున్నాయని ‘, సిధ్ధార్థ కుటుంబ సభ్యుల ఎమోషన్లను ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొంది. సిధ్ధార్థ మృతిపై జరిగే దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని, అంతవరకు కాస్త మానవత్వాన్ని ప్రదర్శించాలని ఈ పార్టీ కౌంటర్ ఇచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర మాజీ సీఎం సిధ్ధరామయ్య కూడా ట్వీట్ చేస్తూ.. ‘ పన్నుల వ్యవస్థ ‘ టెర్రరిజానికి పాల్పడుతోందని, ‘ రాజకీయ దురుద్దేశంతో కూడిన వ్యవస్థలు పేట్రేగుతున్నాయని అన్నారు. సిధ్ధార్థ మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని ఆయన కోరారు. న్యాయంకోసం సిధ్ధార్థ మామగారు ఎస్.ఎం.కృష్ణ జరిపే పోరాటంలో తమ పార్టీ పూర్తి అండగా నిలుస్తుందన్నారు.

ఇదిలా ఉండగా సిధ్ధార్థ ఆత్మహత్యపై దర్యాప్తు ప్రారంభమైంది. ఆయనను నిజంగా ఐటీ అధికారులెవరైనా వేధించారా.. ఆయన ఆదాయాన్ని చూసి ఆయన శత్రువులెవరైనా ఐటీ శాఖకు సమాచారమిచ్చారా.. అసలు ఆయన ఆస్తులు, అప్పులు ఎన్ని, ఎంతమందికి ఆయన అప్పులు ఇవ్వాల్సి ఉంది తదితర విషయాలపై ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అధికారులు ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..