రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలన్న ఇమ్రాన్‌

రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలన్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌.. అత్యాచారానికి పాల్పడిన వారిని అలా బహిరంగంగా ఉరి తీయాలని ఉన్నా పాకిస్తాన్‌ ఆ పని చేయలేదన్నారు ఇమ్రాన్‌..

రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలన్న ఇమ్రాన్‌
Follow us

|

Updated on: Sep 15, 2020 | 1:27 PM

రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలన్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌.. అత్యాచారానికి పాల్పడిన వారిని అలా బహిరంగంగా ఉరి తీయాలని ఉన్నా పాకిస్తాన్‌ ఆ పని చేయలేదన్నారు ఇమ్రాన్‌.. అలా చేస్తే యూరోపియణ్ యూనియన్‌ తమ వాణిజ్య సంబంధాలను తెంచుకుంటుందని చెప్పారు.. మొన్నీమధ్య లాహోర్‌ హైవేపై వెళుతున్న ఓ మహిళను అత్యంత దారుణంగా రేప్‌ చేశారు ఇద్దరు దుండగులు. తన ఇద్దరు పిల్లలతో కలిసి కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళుతున్న ఆమెను ఇద్దరు దుండగులు గన్‌పాయింట్‌తో బెదిరించి రేప్‌ చేశారు.. ఈ సంఘట పాకిస్తాన్‌లో సంచలనం రేపింది.. దేశమంతటా నిరసనలు పెల్లుబికాయి.. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.. నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించాలంటూ జనం డిమాండ్‌ చేశారు.. ఈ ఘటనపై ఇమ్రాన్‌ స్పందిస్తూ దోషులను బహిరంగంగా ఉరి తీయడమే ఉత్తమమని, ఆ పని చేయలేము కాబట్టి రసాయన పద్దతిలో వారి వృషణాలు పని చేయకుండా చేయాలని చెప్పారు.. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.. ఇప్పుడు వారికి ఏ రకమైన శిక్ష విధిస్తారో చూడాలి..