పుల్వామా ఎఫెక్ట్.. వాఘా సరిహద్దులో పాకిస్థాన్ లారీలకు బ్రేక్
వాఘా : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వివిధ రకాల సరుకులు రవాణా చేసే లారీలకు బ్రేక్ పడింది. దీంతో వాఘా సరిహద్దు వద్ద వందల లారీలు నిలిచిపోయాయి. లారీల ప్రవేశానికి అధికారులు అనుమతించక పోవడంతో అట్టారి-వాఘా సరిహద్దులో వాహనాలు బారులు తీరుతున్నాయి. జమ్ముకశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేఅహ్మద్ సభ్యుడు దాడి చేసిన ఘటన అనంతరం పాకిస్థాన్ నుంచి సరుకుల దిగుమతిని భారత్ నిషేధించింది. […]
వాఘా : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వివిధ రకాల సరుకులు రవాణా చేసే లారీలకు బ్రేక్ పడింది. దీంతో వాఘా సరిహద్దు వద్ద వందల లారీలు నిలిచిపోయాయి. లారీల ప్రవేశానికి అధికారులు అనుమతించక పోవడంతో అట్టారి-వాఘా సరిహద్దులో వాహనాలు బారులు తీరుతున్నాయి. జమ్ముకశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేఅహ్మద్ సభ్యుడు దాడి చేసిన ఘటన అనంతరం పాకిస్థాన్ నుంచి సరుకుల దిగుమతిని భారత్ నిషేధించింది. ఈ నిషేధం వల్ల ఇబ్బందులున్నా భారత్ ప్రభుత్వ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని వ్యాపారులు ప్రకటించారు.