రిజర్వ్ ఫారెస్టులో అక్రమ ఇసుక దందా
అక్రమార్కులు అడవుల్లోకి అడుగుపెట్టాలంటే హడలిపోవాలి. వాళ్ల భరతం పట్టేందుకు మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా’ అంటూ సాక్షా త్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినా పరిస్థితి మారడం లేదు. ‘డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం’ అంటూ బోర్డులు తగిలించుకొని మరీ అక్రమార్కులు టిప్పర్లలో ఇసుకను దర్జాగా తరలించుకుపోతున్నారు. నిర్మల్ జిల్లాలోని రక్షిత అటవీ ప్రాంతాల్లో అక్రమ ఇసుక దందా భారీ ఎత్తున జరుగుతోంది. అటవీ సంపద అంటే అడవులొక్కటే కాకుండా ఖనిజ వనరులైన ఇసుక, మాంగనీసు, సున్నపు […]
అక్రమార్కులు అడవుల్లోకి అడుగుపెట్టాలంటే హడలిపోవాలి. వాళ్ల భరతం పట్టేందుకు మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా’ అంటూ సాక్షా త్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినా పరిస్థితి మారడం లేదు. ‘డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం’ అంటూ బోర్డులు తగిలించుకొని మరీ అక్రమార్కులు టిప్పర్లలో ఇసుకను దర్జాగా తరలించుకుపోతున్నారు. నిర్మల్ జిల్లాలోని రక్షిత అటవీ ప్రాంతాల్లో అక్రమ ఇసుక దందా భారీ ఎత్తున జరుగుతోంది.
అటవీ సంపద అంటే అడవులొక్కటే కాకుండా ఖనిజ వనరులైన ఇసుక, మాంగనీసు, సున్నపు రాయి వంటివి కూడా ఆ పరిధిలోకి వస్తాయి. చట్టం ప్రకారం అడవుల్లో తవ్వకాలు జరిపితే చర్యలు తప్పవు. అయినా ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. పెంబి మండలం శెట్పల్లి, పరిసర గ్రామాల్లో ఈ తరహా వ్యవహారాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నిర్మల్ జిల్లావ్యాప్తంగా వందలోపే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారు. కానీ వాటి పేరుతో వేలాది టిప్పర్లలో ఇసుకను తరలించారు. అటవీశాఖ ఈ వ్యవహారాలను అడ్డుకోవడంపై ఇప్పటికైనా దృష్టిసారించాలి.
నిర్మల్ జిల్లాలో ప్రధాన వాగులన్నీ అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్నాయి. కడెం వాగు అంతా రిజర్వ్ ఫారెస్ట్ మీదుగానే పారుతుంది.అలాగే ఖానాపూర్ నియోజకవర్గంలోని పలికేరు వాగు, రాజురా వాగులు కూడా అటవీ ప్రాంతాల మీదుగానే పారుతాయి. ఈ వాగుల్లో ఇసుక లభ్యత భారీగా ఉంటుంది. దీంతో సహజంగానే ఇసుకాసురుల కన్ను వీటిపై పడింది. నిర్మానుష్య ప్రాంతాలను ఆనుకొని ఉండే వాగుల వద్ద భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారు పోగుచేసిన ఇసుకను నిర్మల్లోని ఓ రెడీమిక్స్ కాంక్రీ ట్ ప్లాంట్తో పాటు పలు కాంట్రాక్టు సంస్థలకు అమ్ముతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.