టీడీపీ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాదం
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ శాసనసభ్యుడు బెందాళం అశోక్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన తండ్రి ప్రకాష్ తుదిశ్వాస విడిచారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ శాసనసభ్యుడు బెందాళం అశోక్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన తండ్రి ప్రకాష్ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ప్రకాష్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే అశోక్ను ఫోన్లో పరామర్శించారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి బెందాళం ప్రకాష్ పార్టీకి చేసిన సేవలు అభినందనీయమని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇచ్ఛాపురం తెలుగుదేశం శాసనసభ్యులు బెందాళం అశోక్ గారి తండ్రి… బెందాళం ప్రకాష్ గారి మరణం విచారకరం. తెలుగుదేశం సీనియర్ నేతగా, కవిటి మాజీ ఎంపిపిగా, ఆంధ్రాబ్యాంకు మాజీ డైరెక్టర్ గా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/DM7t7omuTb
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 13, 2020
Also Read :