వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఉండేవి ఆ జట్లే- లక్ష్మణ్

వరల్డ్ కప్ ఫైనల్లో ఏ జట్లు తలపడనున్నాయో భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ జోస్యం చెప్పాడు.  2003 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడిన భారత్‌-ఆసీస్‌ జట్లే 2019 ఫైనల్లోనూ అమీతుమీ తేల్చుకుంటాయని తెలిపాడు. ‘జులై 14న లార్డ్స్‌ మైదానంలో జరిగే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌, ఆసీస్‌ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత భారత జట్టు ఎంతో బలీయంగా ఉంది. బౌలింగ్‌లో బుమ్రా, షమి, భువనేశ్వర్‌ ఉండటం జట్టుకు అదనపు బలం’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆదివారం […]

వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఉండేవి ఆ జట్లే- లక్ష్మణ్
Follow us

|

Updated on: Jun 30, 2019 | 2:32 AM

వరల్డ్ కప్ ఫైనల్లో ఏ జట్లు తలపడనున్నాయో భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ జోస్యం చెప్పాడు.  2003 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడిన భారత్‌-ఆసీస్‌ జట్లే 2019 ఫైనల్లోనూ అమీతుమీ తేల్చుకుంటాయని తెలిపాడు.

‘జులై 14న లార్డ్స్‌ మైదానంలో జరిగే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌, ఆసీస్‌ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత భారత జట్టు ఎంతో బలీయంగా ఉంది. బౌలింగ్‌లో బుమ్రా, షమి, భువనేశ్వర్‌ ఉండటం జట్టుకు అదనపు బలం’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆదివారం జరిగే ఇంగ్లాండ్‌- భారత్‌ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరేట్‌ అని వీవీఎస్ తెలిపాడు.