క్షేమంగా వెళ్లి..గర్వంగా రండి

ముంబయి: ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్‌ జట్టు బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామున ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి కోహ్లీసేన ఇంగ్లాండ్‌ పయనమైంది. కెప్టెన్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ధోనీ సహా ఇతర ఆటగాళ్లు అధికార దుస్తుల్లో విమానాశ్రయంలో ఉన్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ఇంగ్లాండ్‌‌లోని వేల్స్‌ వేదికగా మే 30 నుంచి వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో భారత్‌ తన ప్రయాణం మొదలుపెట్టనుంది. అంతకంటే ముందు […]

క్షేమంగా వెళ్లి..గర్వంగా రండి
Follow us

|

Updated on: May 22, 2019 | 12:11 PM

ముంబయి: ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్‌ జట్టు బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామున ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి కోహ్లీసేన ఇంగ్లాండ్‌ పయనమైంది. కెప్టెన్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ధోనీ సహా ఇతర ఆటగాళ్లు అధికార దుస్తుల్లో విమానాశ్రయంలో ఉన్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ఇంగ్లాండ్‌‌లోని వేల్స్‌ వేదికగా మే 30 నుంచి వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో భారత్‌ తన ప్రయాణం మొదలుపెట్టనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లో కోహ్లీసేన రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.