సెమీస్ రేసులో ఉండనున్న జట్లు ఏవంటే..?
ఇంగ్లండ్లో ఐసీసీ వరల్డ్ కప్ 2019 మ్యాచ్లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఇప్పటికే 14 పాయింట్లతో సెమీస్కు బెర్త్ను ఖాయం చేసుకుంది ఆస్ట్రేలియా. మరోవైపు ప్రస్తుతం 11 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్.. మంగళవారం బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే 13 పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ భారత్ ఓడినా 11 పాయింట్లతో సెమీఫైనల్ రేసులో ఉంటుంది. మరోవైపు జూలై3న న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిస్తే ఎలాంటి […]
ఇంగ్లండ్లో ఐసీసీ వరల్డ్ కప్ 2019 మ్యాచ్లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఇప్పటికే 14 పాయింట్లతో సెమీస్కు బెర్త్ను ఖాయం చేసుకుంది ఆస్ట్రేలియా. మరోవైపు ప్రస్తుతం 11 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్.. మంగళవారం బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే 13 పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ భారత్ ఓడినా 11 పాయింట్లతో సెమీఫైనల్ రేసులో ఉంటుంది. మరోవైపు జూలై3న న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా 12 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. అలా కాకుండా న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోయి… బంగ్లాదేశ్పై పాకిస్తాన్ గెలిస్తే ఆ జట్టు 11 పాయింట్లతో సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది. ఇక భారత్, పాకిస్తాన్లపై నెగ్గడంతోపాటు రన్రేట్ మెరుగైతేనే బంగ్లాదేశ్కు సెమీస్ చాన్స్ ఉంది. కాగా భారత్పై ఇంగ్లండ్ గెలవడంతో శ్రీలంక జట్టు సెమీఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి.