ICC Women’s T20 World Cup: టీ20 ప్రపంచకప్: తొలిసారి ఫైనల్కు చేరిన టీమిండియా
ICC Women’s T20 World Cup: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియా తొలిసారి ఫైనల్కు చేరుకుంది. సిడ్నీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత మహిళలు నేరుగా ఫైనల్కు చేరుకున్నారు. ఇక గత టీ20 వరల్డ్కప్లో హర్మన్ప్రీత్ సేన ఇంగ్లాండ్ చేతుల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి వైదొలగింది. ఇదిలా ఉంటే టీమిండియా ఈ మెగా టోర్నమెంట్లో ఆడిన నాలుగు లీగ్ మ్యాచ్ల్లోనూ గెలిచి మెరుగైన […]
ICC Women’s T20 World Cup: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియా తొలిసారి ఫైనల్కు చేరుకుంది. సిడ్నీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత మహిళలు నేరుగా ఫైనల్కు చేరుకున్నారు. ఇక గత టీ20 వరల్డ్కప్లో హర్మన్ప్రీత్ సేన ఇంగ్లాండ్ చేతుల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి వైదొలగింది. ఇదిలా ఉంటే టీమిండియా ఈ మెగా టోర్నమెంట్లో ఆడిన నాలుగు లీగ్ మ్యాచ్ల్లోనూ గెలిచి మెరుగైన రన్రేట్ సాధించడం వల్ల ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. కాగా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కూడా రద్దయితే.. ఆదివారం ఇండియా వెర్సెస్ దక్షిణాఫ్రికా మెల్బోర్న్ వేదికగా ఫైనల్ పోరులో తలబడనున్నాయి.
For More News:
బిగ్బాస్ 3 విజేతపై బీరు సీసాలతో దాడి.. తలకు తీవ్ర గాయాలు..
కరోనా అలెర్ట్: ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు.. మాస్కులతో పరీక్షలు..
భార్యకు కరోనా సోకిందని బాత్రూమ్లో లాక్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.?
నాలుగు రోజుల్లో అల్లకల్లోలం.. కరోనాను జయించిన కేరళ విద్యార్థిని మనోగతం..
కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.?
కీచక ఆటోడ్రైవర్ను పట్టించిన దిశ యాప్.. మహిళ సేఫ్..