నేను బతికే ఉన్నా.. భారత్పై పగ తీర్చుకుంటా: మసూద్ అజహర్
తాను బతికే ఉన్నానని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ఆడియో రిలీజ్ చేశాడు. ఈ ఆడియో క్లిప్ను జైషే మహ్మద్ చాట్ ప్లాట్ఫాంలో అప్లోడ్ చేశాడు. నేను బతికే ఉన్నా.. ఆరోగ్యంగా ఉన్నా.. కశ్మీరీలను అణగదొక్కుతున్న భారత్పై జిహాద్ ప్రారంభించండి అని అజార్ పిలుపునిచ్చాడు. పాక్ ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ కింద జైషే మహ్మద్ సంస్థపై చర్యలకు దిగిన నేపథ్యంలో మసూద్ స్పందించాడు. మసీదులు, నిజమైన ముస్లీంలపై దర్యాప్తును నిలిపివేయాలని హెచ్చరించాడు. మలాలా […]
తాను బతికే ఉన్నానని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ఆడియో రిలీజ్ చేశాడు. ఈ ఆడియో క్లిప్ను జైషే మహ్మద్ చాట్ ప్లాట్ఫాంలో అప్లోడ్ చేశాడు. నేను బతికే ఉన్నా.. ఆరోగ్యంగా ఉన్నా.. కశ్మీరీలను అణగదొక్కుతున్న భారత్పై జిహాద్ ప్రారంభించండి అని అజార్ పిలుపునిచ్చాడు.
పాక్ ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ కింద జైషే మహ్మద్ సంస్థపై చర్యలకు దిగిన నేపథ్యంలో మసూద్ స్పందించాడు. మసీదులు, నిజమైన ముస్లీంలపై దర్యాప్తును నిలిపివేయాలని హెచ్చరించాడు. మలాలా వంటి ఉదార వాదుల గురించి మాట్లాడుతూ దేశాన్ని వారి చేతుల్లోకి వెళ్లనివ్వమన్నాడు.
మసూద్ అజహార్ ఆరోగ్యం బాగాలేదని, బయటకు కూడా రాలేకపోతున్నాడని పాక్ విదేశాంగ మంత్రి ఖురషీ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. మసూద్ చనిపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే.. తాను చనిపోయినట్టు బూటకపు వార్తలు ప్రచారం చేశారంటూ మసూద్ మండిపడ్డాడు. తాను ఎన్నిరోజులు బతకాలో దేవుడే నిర్ణయిస్తాడని ఆడియో క్లిప్లో మసూద్ చెప్పాడు.