ఎన్ని జిమ్మిక్కులు చేసినా..నా ఓటు బ్యాంక్ చెక్కు చెదరదు- పాల్
జగన్, చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తన ఓటు బ్యాంకు చెక్కుచెదరదని చెప్పారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. పంచ్ పడినందువల్ల, ఓటమికి గురవుతున్నందువల్ల చంద్రబాబుకి ఇప్పటికి కళ్లు తెరుచుకున్నాయని అన్నారు. తనకు ప్రాణ హాని ఉందని చెప్పిన పాల్.. సెక్యురిటీ పెంచాలని కోరారు. దేశ కోసం ప్రాణం కూడా అర్పించాలనుకుంటున్నాని తెలిపారు. తాజాగా జరిగిన ఎలక్షన్స్ వల్ల మోదీకి మాత్రమే లాభమని చెప్పారు. చంద్రబాబు, జగన్ కలిసినా ఎలక్షన్స్లో ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. […]
జగన్, చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తన ఓటు బ్యాంకు చెక్కుచెదరదని చెప్పారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. పంచ్ పడినందువల్ల, ఓటమికి గురవుతున్నందువల్ల చంద్రబాబుకి ఇప్పటికి కళ్లు తెరుచుకున్నాయని అన్నారు. తనకు ప్రాణ హాని ఉందని చెప్పిన పాల్.. సెక్యురిటీ పెంచాలని కోరారు. దేశ కోసం ప్రాణం కూడా అర్పించాలనుకుంటున్నాని తెలిపారు. తాజాగా జరిగిన ఎలక్షన్స్ వల్ల మోదీకి మాత్రమే లాభమని చెప్పారు. చంద్రబాబు, జగన్ కలిసినా ఎలక్షన్స్లో ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. దేశాన్ని ఆర్ఎస్ఎస్ నుంచి కాపాడమని ఇతర దేశాలను నుంచి తనకు కాల్స్ వస్తునట్టు తెలిపారు. కొన్ని ఓట్లు హెలికాప్టర్కు వేస్తే…ఫ్యాన్కు పడ్డాయని తన దృష్టికి వచ్చినట్టు చెప్పారు.