“అందుకే అమెరికా వెళ్లా..త్వరలో ఇండియాకు తిరిగొస్తా”
తాజాగా ఓ న్యూస్ పేపర్ తో మాట్లాడిన సన్నీ... డేనియల్ కుటుంబ సభ్యుల కోసమే తాము అమెరికా వెళ్లామని పేర్కొంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలకు అనుమతులు దొరికిన వెంటనే ముంబయి వచ్చేస్తామని తెలిపింది.
కుదిరినంత త్వరలోనే ఇండియాకు తిరిగి వచ్చేస్తామని బాలీవుడ్ నటి సన్నీలియోన్ తెలిపింది. కోవిడ్-19 వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో తన భర్త డేనియల్ వెబర్, పిల్లలతో కలిసి సన్నీ అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తో విలువైన సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. అక్కడ ఆమె దిగిన ఫోటోలు ఇటీవల వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ పేపర్ తో మాట్లాడిన సన్నీ… డేనియల్ కుటుంబ సభ్యుల కోసమే తాము అమెరికా వెళ్లామని పేర్కొంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలకు అనుమతులు దొరికిన వెంటనే ముంబయి వచ్చేస్తామని తెలిపింది.
“ముంబయి వదలిరావడం నాకు చాలా భాద కలిగించింది. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే అమెరికా వెళ్లాను. డేనియల్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడే ఉంటున్నారు. అయితే వాళ్లమ్మ ఏజ్ చాలా పెద్దది. ఆమెకు ఇప్పుడు మేము పక్కన ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కరోనా వీరవిహారం చేస్తోన్న సమయంలో.. వయసు మీదపడిన ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే నేను అమెరికా వెళ్లాల్సి వచ్చింది. పరిస్థితులు చక్కబడి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలకు అనుమతులు వచ్చిన వెంటనే ఇండియాకు వచ్చేస్తాం” అని సన్నీ లియోన్ పేర్కొంది.