ముంబై పోలీసులపై నమ్మకం ఉంది, శరద్ పవార్

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులపై తనకు నమ్మకం ఉందని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ చెప్పారు. నాకు 50 ఏళ్లుగా మహారాష్ట్ర, ముంబై పోలీసుల గురించి తెలుసు..

ముంబై పోలీసులపై నమ్మకం ఉంది, శరద్ పవార్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 12, 2020 | 6:26 PM

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులపై తనకు నమ్మకం ఉందని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ చెప్పారు. నాకు 50 ఏళ్లుగా మహారాష్ట్ర, ముంబై పోలీసుల గురించి తెలుసు..వారు ఈ కేసును సమర్థంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అని చెప్పారాయన. ఈ కేసును సీబీఐ గానీ మరే సంస్థ అయినా దర్యాప్తు చేసుకోవచ్చునని, తనకు అభ్యంతరం లేదని అన్నారు. దీన్ని సీబీఐ ఇన్వెస్టిగేట్ చేయాలంటూ బీజేపీ చేసిన డిమాండును తన మేనల్లుడు అజిత్ పవార్  కొడుకు పార్త్ పవార్ సమర్థించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇది పరిణతితో లేని వ్యాఖ్యలని కొట్టి పారేశారు. సుశాంత్ కేసులో మంత్రి ఆదిత్య థాకరే జోక్యం ఉందన్న ఆరోపణలను పవార్ ఖండించారు. సుశాంత్ కేసుకు ఆదిత్యకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

మొత్తానికి సుశాంత్ కేసు మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల మధ్య రాజకీయ కేసుగా, వివాదంగా  మారిపోయింది. దీన్ని బీహార్ పోలీసులు దర్యాప్త్జు చేయడాన్ని మహారాష్ట్రలోని  అగ్రనేతలు కూడా తప్పు పట్టడం విశేషం.