ఇళ్ల ముందు కరెన్సీ కట్టలు.. విదేశాల్లో కాదు.. మన దగ్గరే..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్‌ను నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కోనసాగుతోంది. ఈ క్రమంలో ఇళ్ల నుంచి ప్రజలు ఎవరు బయటకు రావోద్దంటూ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో బీహార్‌లో విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఓ పట్టణంలో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు కనిపించడంతో.. ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..బీహార్‌లోని సహస్ర పట్టణంలో.. […]

ఇళ్ల ముందు కరెన్సీ కట్టలు.. విదేశాల్లో కాదు.. మన దగ్గరే..!
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2020 | 10:44 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్‌ను నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కోనసాగుతోంది. ఈ క్రమంలో ఇళ్ల నుంచి ప్రజలు ఎవరు బయటకు రావోద్దంటూ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో బీహార్‌లో విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఓ పట్టణంలో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు కనిపించడంతో.. ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే..బీహార్‌లోని సహస్ర పట్టణంలో.. ఓ గుర్తుతెలియని వ్యక్తి.. ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు ఉంచుతూ.. వాటితో పాటుగా ఓ లెటర్‌ పెడుతున్నాడట. నేను కరోనాతో వచ్చాను.. ఈ నోటును స్వీకరించండి లేదంటే.. ప్రతి ఒక్కరినీ వేధిస్తాను అంటూ అందులో రాస్తూ.. ఇళ్ల గుమ్మాల ముందు పెడుతున్నాడట. రూ.20, రూ.50, రూ.100 నోట్లను పెడుతూ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడట. గత మూడు నాలుగు రోజులుగా ఇలా నోట్లు ప్రత్యక్షమవుతున్నాయట. ఇలా ఇప్పటివరకు మూడు ఇళ్ల ముందు నోట్లు ప్రత్యక్షమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే నోట్లతో పాటు లెటర్‌లో ఉన్న రాత ఆధారంగా ఇది ఓ అగంతకుడు కావాలనే చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.