గుణపాఠం నేర్చుకోలేమా ఇకనైనా ?

అంచనాలకు, జ్యోతిష్యాలకు మించి ప్రభావం చూపిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు బాగానే న్యాయం చేశాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో వానలు దంచి కొడుతున్నాయి. పడికట్టు భాషలో చెప్పాలంటే లోతట్టు ప్రాతాలన్నీ తరచు జలమయం అవుతున్నాయి. 2000 లో కురిసిన భారీ వర్షాలు అప్పట్లో ప్రభుత్వానికి, జిహెచ్ఎంసి అధికారులకు కొత్త మార్గం అనుసరించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపాయి. అప్పట్లో బతుకమ్మ కుంటతో పాటు లోయర్ ట్యాంక్ బండ్, సఫిల్ గూడ ట్యాంక్ బండ్ కింది […]

గుణపాఠం నేర్చుకోలేమా ఇకనైనా ?
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 4:51 PM

అంచనాలకు, జ్యోతిష్యాలకు మించి ప్రభావం చూపిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు బాగానే న్యాయం చేశాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో వానలు దంచి కొడుతున్నాయి. పడికట్టు భాషలో చెప్పాలంటే లోతట్టు ప్రాతాలన్నీ తరచు జలమయం అవుతున్నాయి. 2000 లో కురిసిన భారీ వర్షాలు అప్పట్లో ప్రభుత్వానికి, జిహెచ్ఎంసి అధికారులకు కొత్త మార్గం అనుసరించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపాయి. అప్పట్లో బతుకమ్మ కుంటతో పాటు లోయర్ ట్యాంక్ బండ్, సఫిల్ గూడ ట్యాంక్ బండ్ కింది ప్రాంతాలనీ జలమయం అవడంతో తొలిసారి నగర వీధుల్లో బోట్లలో తిరుగుతూ రిపోర్టింగ్ చేయాల్సి వచ్చింది.

అనూహ్యంగా వచ్చిన భారీ వర్షాలు, ఫలితంగా వచ్చిన వరదలను అంచనా వేయలేకపోయామని అందువల్లే నష్టం భారీగా సంభవించిందని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసి అధికార గణం చెప్పి తప్పించుకుంది.. భారీ స్థాయిలో.. దూర దృష్టితో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతీ ఒక్కరూ ప్రకటనల మీద ప్రకటనలిచ్చారు.

కానీ, దాదాపు 20 ఏళ్ళ తర్వాత హైద్రాబాద్లో భారీ వర్ష కురిస్తే అదే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి బాధ్యులెవరు ? ఎవరి వైఫల్యం ? ఎవరి నిర్లక్ష్యం ? హైదరాబాద్ ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా మార్చమని చెప్పుకునే పాలకులు వర్షం కురిస్తే అడుగు తీసి అడుగు వేయడం కూడా గగనంగా మారే రాజధాని రోడ్లపై ఏమి చెప్తారు ? వేలాది కోట్లు నగరాభివృద్ధికి కేటాయిస్తున్నామనే సర్కార్ ఏం చెబుతుంది ? నిధులన్నీ ఎటు పోయాయని అడిగితే ప్రభుత్వాధినేతల సమాధానం ఏంటి ?

హైదరాబాద్ ను తామే అభివృద్ధి చేశానని చెప్పుకునే గత పాలకులు వర్షం పడితే ఎక్కడికి కక్కడ నిలిచిపోయే వర్షపు నీటిని చూడడం లేదా ? నోళ్లు తెరిచి ప్రాణాలకు హరించే మాన్ హొళ్లను చూస్తూ ఏం చెబుతారు ? అక్కడికక్కడే స్థంభించిపోయే ట్రాఫిక్ లో తాము ఇరుక్కుపోతే గాని ఆ నరక యాతన గురించి పాలకులకు తెలియదేమో కదా ?

ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి కాబట్టి సైబరాబాద్ ప్రాంతం పై ఫోకస్ చేస్తున్నారు బాగానే ఉంది కానీ వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మిగితా భాగ్యనగరంపై ఫోకస్ ఏది ? పోనీ సైబరాబాద్ వారిపైన అయినా సరిగ్గా ఫోకస్ చేస్తున్నారా అంటే గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ అక్కడి ప్రజలకు, ఉద్యోగులకు నరక యాతన చూపిస్తున్న విషయం తెలియదా ?

బృహత్తర ప్రణాళిక లేకపోతే ఎన్ని దశాబ్దాలైనా భాగ్యనగర దుస్థితి ఇంతే. ఇది నిష్టుర సత్యం. దూర దృష్టితో ప్రణాళికలు, కచ్చితమైన వైఖరితో రోడ్ల విస్తరణ, అంతే కచ్చితమైన విధానంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం నిర్మించకపోతే భవిష్యత్ తరాలు ఇప్పటి పాలకులను దూరదృష్టి లేని నేతలుగానే చూడక తప్పదు. విశ్వనగరమని మనం భుజాలు చరచుకుంటే సరిపోతే ఆచరణలో విశ్వనగరమని చూపాలి.. నగరాన్ని విజిట్ చేసే ప్రతీ ఒక్కరికీ ఆ భావన కలగాలి. అందుకు ఈ ప్రభుత్వమైనా గట్టి సంకల్పం చూపాలి..

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..