షాకింగ్ ఫాక్ట్ : ఎక్కువగా అప్పులు చేస్తోన్న హైదరాబాదీ యూత్…

అప్పు అంటే చాలు..హైదరాబాద్ యూత్ తెగ ఇంట్రస్ట్ చూపిస్తుందట. ఎలక్ట్రానిక్ యాప్ ‘క్యాష్ ఈ’ ద్వారా రుణాలు తీసుకునే వారి జాబితాలో హైదరాబాదీ యూత్ సెకండ్ ప్లేసులో ఉన్నట్టు షాకింగ్ ఫాక్ట్ రివీలయ్యింది.  ఆన్‌లైన్ ద్వారా లోన్స్ ఇచ్చే ‘క్యాష్ ఈ’ తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు, మెడికల్ ఖర్చుల కోసం భాగ్యనగర యూత్ ఎక్కువగా అప్పులు చేస్తున్నారని వెల్లడించింది. కాగా ఈ జాబితాలో బెంగుళూరు ఫస్ట్ ప్లేసులో ఉంది. రుణాలు […]

షాకింగ్ ఫాక్ట్ : ఎక్కువగా అప్పులు చేస్తోన్న హైదరాబాదీ యూత్...
Follow us

|

Updated on: Jan 21, 2020 | 5:29 PM

అప్పు అంటే చాలు..హైదరాబాద్ యూత్ తెగ ఇంట్రస్ట్ చూపిస్తుందట. ఎలక్ట్రానిక్ యాప్ ‘క్యాష్ ఈ’ ద్వారా రుణాలు తీసుకునే వారి జాబితాలో హైదరాబాదీ యూత్ సెకండ్ ప్లేసులో ఉన్నట్టు షాకింగ్ ఫాక్ట్ రివీలయ్యింది.  ఆన్‌లైన్ ద్వారా లోన్స్ ఇచ్చే ‘క్యాష్ ఈ’ తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు, మెడికల్ ఖర్చుల కోసం భాగ్యనగర యూత్ ఎక్కువగా అప్పులు చేస్తున్నారని వెల్లడించింది. కాగా ఈ జాబితాలో బెంగుళూరు ఫస్ట్ ప్లేసులో ఉంది. రుణాలు ఎక్కువగా తీసుకుంటున్న వారిలో 31 నుంచి 38 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారని సదరు సంస్థ వెల్లడించింది. ‘క్యాష్ ఈ’ లోన్స్ తీసుకునేందుకు మహిళలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదని, తమకు అప్లికేషన్స్ పెట్టుకునేవారిలో 10 శాతం మాత్రమే విమెన్ వాటా ఉన్నట్లు తెలిపారు. ‘క్యాష్ ఈ’ ద్వారా లోన్లు తీసుకునే వారి జాబితాలో లాస్ట్ ఇయర్ వరకు ముంబై ఫస్ట్ ప్లేసులో ఉంది. కానీ బెంగుళూరు ఇప్పుడు ఆ ప్లేసును ఆక్రమించింది. నెలకు 25వేల నుంచి 50 వేల సంపాదించే పెళ్లైన ఉద్యోగస్థులు తమ సంస్థను ఎక్కువగా ఆశ్రయిస్తున్నట్టు ‘క్యాష్ ఈ’ తెలిపింది.