కిషన్రెడ్డిపై ఒవైసీ ఫైర్!
హైదరాబాద్ టెర్రరిస్ట్ హబ్’ అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ సేఫ్ జోన్ అంటూ అమిత్షా సహాయ మంత్రి బాధ్యతలేని వ్యాఖ్యలు చేయడం సరి కాదని అన్నారు. ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకిగా కిషన్రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు.ఉగ్రవాదానికి హైదరాబాద్ సేఫ్ జోన్ అని ఎన్ఐఏ, ఐబీ, రా ఎన్నిసార్లు లిఖిత పూర్వకంగా చెప్పాయని ఒవైసీ ప్రశ్నించారు. […]
హైదరాబాద్ టెర్రరిస్ట్ హబ్’ అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ సేఫ్ జోన్ అంటూ అమిత్షా సహాయ మంత్రి బాధ్యతలేని వ్యాఖ్యలు చేయడం సరి కాదని అన్నారు. ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకిగా కిషన్రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు.ఉగ్రవాదానికి హైదరాబాద్ సేఫ్ జోన్ అని ఎన్ఐఏ, ఐబీ, రా ఎన్నిసార్లు లిఖిత పూర్వకంగా చెప్పాయని ఒవైసీ ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా హైదరాబాద్ ఎంతో ప్రశాంతంగా ఉందని, ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదని, మతపరమైన పండుగలన్నీ శాంతియుతంగా జరిగాయని ఒవైసీ గుర్తు చేశారు. ముస్లింలంటే కేవలం ఉగ్రవాదులేననే అభిప్రాయం బీజేపీకి ఉందని, అయితే ముస్లింలంతా ఉగ్రవాదులు కాదనే విషయం గ్రహించడం మంచిదని ఒవైసీ తెలిపారు.
Asaduddin Owaisi, AIMIM: Since past 5 yrs there is peace here, there are no communal riots, religious festivals are peacefully celebrated, it is a growing city and he is speaking like that. What enmity do they have with Telangana, Hyderabad? Do they not like that it is growing? https://t.co/s6fveylyVj
— ANI (@ANI) June 1, 2019