హైదరాబాద్లో మొదలైన మెట్రో ట్రయల్ రన్
అన్లాక్డౌన్లో భాగంగా ఈ నెల 7నుంచి నగరంలో మెట్రోను నడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్న విసయం తెలిసిందే.
Hyderabad Metro Rail: అన్లాక్డౌన్లో భాగంగా ఈ నెల 7నుంచి నగరంలో మెట్రోను నడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్న విసయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రయల్ రన్ని ప్రారంభించారు. మెట్రో ఎండీ ఆధ్వర్యంలో టీమ్ స్టేషన్లను పరిశీలిస్తోంది. అలాగే కరోనా నిబంధనల విషయంలో ఏర్పాట్లను మెట్రో, ఎల్అండ్టీ అధికారులు పరిశీలిస్తున్నారు. ట్రయిల్ రన్లో భాగంగా ఇవాళ అమీర్పేట్ నుంచి మియపూర్ వరకు మెట్రో ప్రయాణించనుంది. దశల వారీగా మెట్రోను ప్రారంభించాలనుకుంటున్న అధికారులు.. భౌతిక దూరం పైననే ఎక్కువ దృష్టి పెట్టనున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ట్రిప్పుల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా 7న మియపూర్ నుంచి ఎల్బీనగర్.. 8వ తేదీన నాగోల్ నుంచి రాయదుర్గం.. 9న అన్ని మార్గాల్లో మెట్రో సర్వీసులు తిరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు తిరిగి 4 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే మెట్రోలు తిరగనున్నాయి. అలాగే కంటైన్మెంట్ జోన్లలో మెట్రో క్లోజ్ అవ్వనుంది. ఇక ఈ సందర్భంగా ప్రయాణికుల కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
Read More: